Congress Politics: రైతు ప్రయోజనాలు పణంగాపెట్టి
రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను విస్మరించి రాజకీయాలపైనే దృష్టి పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ద్వజమెత్తారు.
రాజకీయాలపై దృష్టి సారించారు
రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నా ధాన్యం కొనుగోళ్ల పై ప్రభుత్వం నిర్ల క్ష్యం
ఉద్యోగాల విషయంలోనూ కాంగ్రె స్ ప్రభుత్వం మోసం
మీడియా సమావేశంలో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల(farmer) ప్రయోజనాలను విస్మరించి రాజకీయాల(Politics)పైనే దృష్టి పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) ద్వజమెత్తారు. ధాన్యం కొనుగోలుపై రైతులు నిరస న వ్యక్తం చేస్తున్నా ధాన్యం కొనుగో ళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం వహిoచింద ని మండిపడ్డారు.బుధవారం ఆయన మీడియా తో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండి పడ్డారు. తరుగు పేరుతో క్వింటా ల్కు మూడు కేజీలు తీస్తున్నారని, రైతులకు అన్యాయం చేయొద్దని డిమాండ్ చేశారు. రైతులకు అన్యా యం చేస్తే బీఆర్ఎస్ రోడ్డెక్కి ఆందో ళన చేస్తుందని హెచ్చరించారు.
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నాలుగు పర్యాయాలు బీఆర్ఎస్(BRS) మాత్రమే గెలిచిందని తెలిపారు. కేసీఆర్కు బలాన్ని చేకూర్చేలా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో రాకేష్ రెడ్డిని గెలిపించా లని కోరారు. మెగా డీఎస్సీ దగా అయిందని ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్(congress) ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు తానే ఇచ్చినా అని రేవంత్ రెడ్డి(Revanth reddy) అబద్ధాలు చెబుతు న్నారన్నారు. ప్రశ్నించే గొంతు పార్టీ ఉంటేనే ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్నారు.
ఒక బ్లాక్ మెయిలర్ను కాంగ్రెస్ పార్టీ పోటీలో పెట్టిందని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రె స్ అభ్యర్థిని గెలిపిస్తే నల్లగొండలో నయీమ్ లాంటి వ్యక్తిని తయారు చేసినవాళ్ళం అవుతామన్నారు. ఉద్యోగులను ముఖ్యమంత్రి నిందించటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి దిక్కుమాలిన మాట లు మాట్లాడొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.నారాయణ ఖేడ్లో టీచర్లపై లాఠీ ఛార్జ్ చేస్తారా అంటూ మండిపడ్డారు. మూడు లక్షలఎనభై కోట్ల అప్పు మాత్రమే రాష్ట్ర ప్రభు త్వం అప్పు చేసిందని రిజర్వ్ బ్యాం కు నివేదిక రిలీజ్ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అంటూ ఫేక్ ప్రచారం చేస్తోంద న్నారు. దీనికి సీఎం, డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఊసరవెల్లిలా మాట్లాడు తున్నారన్నారు. హైదారాబాద్ విషయంలో బీజేపీ ఏం చేయబో తుందో జూన్ 4 తర్వాత తెలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
Congress focus on politics and ignored farmers