Modi: పౌరసత్వ సవరణ చట్టం అమలు ఆరంభమైంది
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం ఇప్పటికే అమల్లో ఉన్నందున శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేస్తున్నామని ప్రధా న మంత్రి మోదీ ఉద్ఘాటించారు.
చట్టం అమలులో ఉంది, శరణా ర్థులకు పౌరసత్వం ఇచ్చేస్తున్నాం
మీరేం చేస్తారో చేసుకోండని ఇండి యా కూటమికి ప్రధాని సవాల్
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ఎన్ని కల ప్రచార సభల్లో మోదీ
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Amendment Act) ఇప్పటికే అమల్లో ఉన్నందున శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేస్తున్నామని ప్రధా న మంత్రి మోదీ ఉద్ఘాటించారు. సదరు చట్టాన్ని ఎవరూ తీసి వేయలేరని, ఏం చేస్తారో చేసుకోం డని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తీసేస్తామన్న విపక్ష ‘ఇండీ’ కూటమిపై ప్రధాని మోదీ విరుచు కుపడ్డారు. గురువారం ఉత్తరప్ర దేశ్, మహారాష్ట్రల్లో పలు చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. దేశంలో సీఏఏ అమలు మొదలైపోయిందన్నారు. విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
పౌరసత్వం(Citizenship Amendment Act) పొందిన శరణార్థులు(migration) హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, దీర్ఘకాలంగా దేశంలో శర ణార్థులుగా జీవిస్తున్నారు. మత ప్రాతిపదికన జరిగిన దేశవిభజన బాధితులు వీరు. గద్దెనెక్కితే సీఏ ఏని తీసివేస్తామని ఇండీ కూటమి(India alliance) అంటోంది. కానీ ఎవరూ ఈ చట్టా న్ని తొలగించలేరు. వేల మంది కి పౌరసత్వం ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ మోసకారి పార్టీ అని మతతత్వ జ్వాలల్లో దేశం తగులబడేలా చేసిందని ధ్వజమెత్తారు. జమ్మూకశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను కూడా తాము తీసివేశామన్నారు. శ్రీనగర్ లోక్ సభ స్థానానికి ఇటీవల జరిగిన పోలింగ్ సందర్భంగా ప్రజాస్వామ్య పండుగలో ప్రజలు సగర్వంగా పాల్గొన్నారని.. ఈ అధికరణను ఎవరూ పునరుద్ధరించలేరనడానికి ఇది నిదర్శనమని తెలిపారు.
సమా జ్ వాదీ పార్టీ,(Samajwadi party) దాని అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్(Akhilesh yadav) ప్రధాని మండి పడ్డారు. గతంలో ఆజంగర్ ను ఉగ్ర వాద కేంద్రంగా తయారుచేశారని, బాంబు పేలుళ్లకు పాల్పడినవారికి క్షమాభిక్ష పెట్టారని,రాజకీయాల ముసుగులో స్లీపర్ సెల్స్ పనిచేశా యని ఈ కారణంగా దేశమంతటా ఉగ్రవాదం విస్తరించిందని ఆరోపిం చారు. కాంగ్రెస్, సమాజ్వాదీ వేర్వే రు పార్టీలైనా రెంటికీ ఒకే దుకాణం ఉంది. బుజ్జగింపు రాజకీయాలు, అబద్దాలు, కుటుంబ వాదం, అవి నీతిని అక్క డ అమ్ముతుంటారని, ఈ ఎన్నికల్లో బుజ్జగింపుల ట్రిపుల్ డోన్తో ముందుకొచ్చారని, రాజ్యాం గం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను లాక్కుని తమ ఓటు బ్యాంకుకు కట్టబెట్టాలను కుంటు న్నారని, అలాగే ఈ కూటమి మీ ఆస్తిలో సగం తీసుకుని తమ ఓటు బ్యాంకుకు కానీ కుటుంబవాదులు మాత్రం దూషిస్తున్నారని విమర్శిం చారు.
సమాజ్ వాదీ యువరాజు, ఆయన బాబాయి రామాలయం పనికిమాలినదని అంటున్నారని, కాశీని కూడా ఎద్దేవా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచంలో భారత్ సత్తాను చాటే ప్రధానిని ఎన్నుకోవ డానికి ప్రస్తుత ఎన్నికలు అవకాశ మని మోదీ అన్నారు. ఐదేళ్లలో ఐదుగురిని ప్రధాన మంత్రులను చేయాలని ఇందీ కూటమి అనుకుం టోదని ఎద్దేవాచేశారు. జూన్ 4 తర్వాత ఈ కూటమి విచ్ఛిన్నమవు తుందని చెప్పారు. ఫలితాలు వచ్చాక ఢిల్లీ, లఖ్ నవూ యువరా జులు వేసవి విహార యాత్రకు విదేశాలకు వెళ్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఎక్స్రే మెషీన్ (కులగణన)(BC caste) తెచ్చారని, గత వారం రోజులుగా వారి ఎజెం డాను బయటపెడుతున్నానని, ఆ మెషీన్ పగిలిపోయినట్లే కనిపి స్తోందని అన్నారు.
500 ఏళ్ల నిరీ క్షణ తర్వాత అయోధ్యలో రామా లయం నిర్మించుకున్నామని, యావ ద్దేశంతో పాటు ప్రపంచంలోని ప్రతి భారతీయుడు ఇందుకు ఆనందిస్తు న్నారని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మైనా రిటీలకు బడ్జెట్లో 15 కేటాయించా లని కాంగ్రెస్ ప్రతిపాదించిందని మోదీ తెలిపారు. అప్పట్లో తాను గుజరాత్ సీఎంగా ఉన్నానని, బీజేపీ దీనిని పూర్తిగా వ్యతిరేకిం చిందని, దాంతో వెనక్కి తగ్గారని చెప్పారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ఆ ప్రతిపాదన తెస్తోందని, ‘కాంగ్రెస్ ను ఎన్నుకుంటే బడ్జెట్ ను హిందూ బడ్జెట్, ముస్లిం ఐడ్జెట్గా విభజి స్తుందని, మతప్రాతిపదికన రిజర్వే షనూ అంగీకరించబోనని బాబా సాహెబ్ అంబేడ్కర్ కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేకించారని తెలి పారు.
Citizenship Amendment Act Implementation in India