Rains: కుండపోతతో కుమ్మేసిన వరుణుడు
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వరు ణుడు కుండపోతతో కుమ్మేశాడు. హైదరాబాద్లో కురిసిన కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జల మయమయ్యాయి.
నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
భాగ్యనగరం ప్రజల బాధలు వర్ణ నాతీతం
యూసుఫ్గూడలో 9 సెం.మీ, మలక్పేటలో 8 సెం.మీ.పైనే
జిల్లాలోనూ దంచికొట్టిన వర్షం,
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
అధికారులూ అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వరు ణుడు(rains) కుండపోతతో కుమ్మేశాడు. హైదరాబాద్లో కురిసిన కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జల మయమయ్యాయి. రోడ్లపై భారీగా(flooded) వరద నీరు చేరడంతో వాహనదా రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెట్లు, కొమ్మలు విద్యుత్తు తీగలపై విరిగిపడటంతో పలుచోట్ల సరఫ రాకు అంతరాయం ఏర్పడింది. గు రువారం మధ్యాహ్నం వరకు నగ రంలో సూర్యప్రతాపంతో ఎండలు దంచికొట్టినా ఆ తర్వాత 3 గంటల నుంచి వాతావరణం పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది.
ఆకాశం పూర్తిగా మేఘావృతమై భారీ వర్షం పడడoతో యూసుఫ్గూడలో 9 సెం.మీ., బంజారాహిల్స్ వెంకటే శ్వరకాలనీ 8.7 సెం.మీ, మలక్ పేటలో 8.5, బేగంబజార్లో 8.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్, అమీర్ పేట, ఎర్రగడ్డ, నాంపల్లి, అంబర్పేట, బేగంబజార్, గోల్కొండ, గౌలిగూడ, ఖైరతాబాద్, ఆసిఫ్నగర్, షేక్పేట, ఫిల్మ్నగర్, చార్మినార్, మూసాపేట, మోతీన గర్, మాదాపూర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, బోరబండ ప్రాంతాల్లో నూ వాన దంచికొట్టింది. బంజా రాహిల్స్ రోడ్ నంబర్ 9 ఉదయ నగర్ కాలనీలో నాలా రిటైనింగ్వాల్ కూలడంతో రోడ్లపై నిలిచిన వాహ నాలు కొట్టుకుపోయాయి. ఆగా పురా, ఆస్మాన్గఢ్, మల్కాజిగిరి, రామచంద్రాపురంలో చెట్లు, కొమ్మ లు విద్యుత్తు తీగలపై విరిగిపడ టంతో సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తు శాఖ అధికారులు తక్షణ మే మరమ్మతులుచేపట్టారు.
ఫిల్మ్ నగర్, శ్రీకృష్ణానగర్ బీబ్లాక్ ప్రాంతా ల్లో పలు షాపుల్లోకి వదర(flooded) నీరు చే రింది. మధురానగర్, ఫిలింనగర్ , బేగంబజార్, మన్సూరాబాద్ డివి జన్ సాయినాథ్ కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల రోడ్లపై నీరు నిల్చి గంటలకొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోయింది. వర్షాల నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికా రులు సూచించారు. ఏవైనా సమ స్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 040–2111 1111, డీఆర్ఎఫ్ నంబర్ 90001 13667కు సంప్రదించాలని వెల్లడించారు.
జిల్లాల్లోనూ దంచికొట్టిన వర్షాలు.. ఉమ్మడి రంగారెడ్డి, నల్ల గొండ, మహబూబ్నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సైతం వర్షాలు దంచి కొట్టాయి. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం పడింది. దీంతో పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రా ల్లోని ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల కాంటా వేసిన ధాన్యం బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయి. హన్మ కొండ పట్టణంలో పలు లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచింది. వరంగల్, నిజామాబాద్ పట్టణాల్లో భారీ వర్షం పడటంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డా యి. మునుగోడులో ఈదురుగాలు లకు తోటల్లో మామిడి,నిమ్మకాయ లు రాలిపోయాయి. కోహీర్ మండ లం బిలాల్పూర్లో ఐదెకరాల అర టి తోట నేల కొరిగింది. పలుచోట్ల కూరగాయల పంటలు సైతం దెబ్బ తిన్నాయి. చేవెళ్ల, కేశంపేట, యా చారం, దోమ, ఆలేరు, వలిగొండ మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి పోవ డంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. ధారూర్ మండలంలో నాగారంలో 500 బస్తాలకు పైగా ధాన్యం తడిసింది.పిడుగులు పడి వేర్వేరు చోట్ల ముగ్గురు మృతి చెందగా పలువురికి గాయాల య్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరా నగర్లోని భరత్నగర్కు చెందిన రైతు రుద్రారపు చంద్రయ్య(42) పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
వేములవాడ ముని సిపాలిటీ పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన కంబళ్ల శ్రీనివాస్ (30), రేగుల దేవ య్య, రేగుల శ్రీనివాస్, కంబళ్ల కొమురవ్వ, కంబళ్ల ఎల్లయ్య చింతకాయ చెట్ల కాయలు దులిపేందుకు వెళ్లారు. ఈ నేపథ్యం లోనే భారీవర్షంతో పిడుగుపడి శ్రీనివాస్ మృతి చెందగా మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. వారి ని వేములవాడలోని ఆసుపత్రికి తరలించారు. కడ్తాల మండలం వాసుదేవ్పూర్లో మాడ్గుల మం డలం కలకొండకు చెందిన పసు నూరి ప్రవీణ్చారి (32), అతని మామ నాగోజు జంగాచారిపై పిడుగు పడింది. దీంతో ప్రవీణ్చారి మృతి చెందగా జంగాచారితో పాటు మరొకరు గాయపడ్డాడు. పరిగిలో వర్షానికి ప్రహరీ గోడ కూలి 15 మేకలు మృతి చెందాయి. ఇది ఇలా ఉండగా రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
Heavy rains in Hyderabad