kishan reddy: కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదు
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ ఎస్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీల రాం రాం
తెలంగాణలో ప్రత్యామ్నాయంగా నిలవబోతున్నాం
ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి(kishan reddy) అన్నారు. రాష్ర్టంలో రాజకీయ ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని తెలిపారు. భువనగిరిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక భేటీలో, హనుమకొండలో జరిగిన ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనం, బీజీపీ కార్యకర్తల భేటీలో కిషన్రెడ్డి మాట్లాడారు.
ప్రజా దీవెన, భువనగిరి: కాంగ్రెస్ అధిష్ఠానాన్ని పొగుడుతూ, విపక్షా లను విమర్శిస్తూ కాలయాపన చేయడం రేవంత్ కు అలవాటుగా మారిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ మొదలుకుని అన్ని పదవులకు బీజేపీ పోటీ చేస్తుందని, అందుకు స్థానిక నాయకులు సన్నద్ధం కావా లని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే దానం, కడియం తరహాలో పార్టీ మారతాడని కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే రేవంత్ రెడ్డి జపం చేస్తాడని అన్నారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ని గెలిపిస్తే ప్రజా గొంతుకగా నిలుస్తా రని తెలిపారు. మంత్రులు గొడవలు పడి ప్రభుత్వాన్ని కూల్చుకుంటే తామేమీ చేయలేమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నా రు.
రైతుల సమస్యలను పరిష్కరిం చాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావ్ పటేల్, పైడి రాకేశ్ రెడ్డి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యాన్ని కొనాలని, రుణమాఫీ చేయాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని బీజేపీనేత రఘునందన్రావు తెలిపా రు. కేసులో ఆధారాలున్నా ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబం ధించి డీజీపీ రవిగుప్తాను రఘునం దన్ శనివారం కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటికి వియ్యంకుడు అయినందునే వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయలేదా అని డీజీపీని అడిగామని చెప్పారు.
Congress not fulfilled its promises