Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Modi: రాహుల్ ది అనవసర రాద్దాంతం

కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌గాంధీ వాడు తున్న మావోయిస్టు భాష కారణం గా ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామిక వేత్త అయినా ఒకటి కి యాభైసార్లు ఆలోచిస్తాడని ప్రధా ని మోదీ ఎద్దేవా చేశారు.

ఆయన భాష సైతం మావోయిస్టు పరిభాషలా ఉంది
దాంతోనే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడులకు 50సార్లు ఆలోచి స్తారు
జార్ఖండ్, బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

ప్రజా దీవెన, జంషెడ్‌పూర్‌: కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌గాంధీ(rahul gandhi) వాడు తున్న మావోయిస్టు భాష కారణం గా ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామిక వేత్త అయినా ఒకటి కి యాభైసార్లు ఆలోచిస్తాడని ప్రధా ని మోదీ(modi) ఎద్దేవా చేశారు. పారిశ్రా మికవేత్తల నుంచి డబ్బు దోచుకో వడానికే ఆయన ఆ భాష వాడు తున్నారని ఆరోపించారు. ముస్లిం ఛాందసవాదుల ఒత్తిడితో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(mamatha benergee) హిందూ సాధుసంతులపై విమర్శలు చేస్తు న్నారని మోదీ మండిపడ్డారు.

ఆదివారం ఆయన ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌, పశ్చిమబెంగాల్‌లోని పురూలియా, బిష్ణుపూర్‌లో ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. ఝార్ఖం డ్‌లో తాము నక్సల్స్‌ వెన్ను విరిస్తే డబ్బు దోచుకునే బాధ్యతను కాం గ్రెస్‌, ఝార్ఖండ్‌ ముక్తిమోర్చా తీసు కున్నాయని దుయ్యబట్టారు. పీకల్లో తు అవినీతిలో మునిగిపోయిన ఆ రెండు పార్టీలూ దేశాభివృద్ధి కోసం ఏమీ చేయలేదనివ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా, బిష్ణుపూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ రామకృష్ణ మిషన్‌, భారత్‌ సేవాశ్రమ్‌ సంఘకు చెందిన కొందరు సాధుసన్యాసులు ఢిల్లీలోని బీజేపీ నేతల ప్రభావంతో తృణమూల్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకం గా పనిచేస్తున్నారంటూ ఆ రాష్ట్ర సీఎం మమత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

సేవకు, నైతి కతకు పేరెన్నికగన్న ఇస్కాన్‌, రామ కృష్ణ మిషన్‌, భారత్‌ సేవాశ్రమ్‌ సం ఘ విషయంలో టీఎంసీ హద్దులు దాటి, తప్పుడు ప్రచారాలకు పాల్ప డుతోందని, మమత బహిరంగంగా నే ఆ సంస్థలను బెదిరిస్తూ హెచ్చరిక లు జారీచేస్తున్నారని ఆరోపించారు. జూన్‌ 4న తాము మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాక అవినీతి పరులం దరినీ శాశ్వతంగా జైలుకు పంపుతా మని హెచ్చరించారు. కాంగ్రెస్‌, టీఎంసీ పార్టీలు అవినీతి విషయం లో ఒకే నాణేనికి రెండు ముఖాల్లాం టివని మోదీ ఎద్దేవా చేశారు. టీఎం సీ, కాంగ్రెస్‌, వామపక్షాలు వేర్వేరు పార్టీలుగా కనిపించినా, ఆ పార్టీలు చేసిన పాపాలు ఒకటే. అందుకే ఇండియా కూటమిగా ఏర్పడ్డాయ న్నారు.

modi criticises rahul gandhi