Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fifth phase lok sabha elections: ఐదో విడత వరకే మా అధికారం ఖాయం

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఐదు విడతలు పూర్తయ్యే సరికి మూడో సారి మోదీ సర్కార్ అధికారంలోకి రావడం ఖాయమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఐదు విడతలు( fifth phases lok sabha elections) పూర్తయ్యే సరికి మూడో సారి మోదీ సర్కార్ (Modi govt)అధికారంలోకి రావడం ఖాయమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచా ర ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ యువరా జులు కలిసి యూపీలో 79 సీట్లు గెలుస్తామంటూ వదంతులు సృష్టి స్తూ, పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. జూన్ 4వ తేదీన ప్రజలే వారిని మేలుకొలుపుతారని, అప్పుడు(EVMs) ఈవీఎంలను నిందిస్తూ గగ్గోలు మొదలుపెడతారని విమ ర్శించారు.తరచు మనలను బెదరిం చే ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్ ఇప్పుడు అతలాకుతలమైందని, ఇప్పుడు ఇండియాను కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) బెదిరించే ప్రయ త్నం చేస్తున్నాయి. పాకిస్థాన్‌ను చూసి మనం భయపడాలని వారు చెబుతున్నారని మోదీ ఎద్దేవా చేశా రు. ప్రధాని మోదీ సభలో ఉత్తరప్రదే శ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనా థ్ కూడా పాల్గొని ప్రసంగించారు.

 

Modi coming to power in fifth phases lok sabha elections