Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mallikarjuna Kharge: మోదీ పచ్చి మోసగాడు ఆయనవన్నీ అబద్ధాలే

లోక్ సభ ఎన్నికల ప్రచారం లో ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ మోసగాడిగా అవతరించాడని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రామ మందిరంపైకి కాంగ్రెస్ బుల్డో జర్‌ను పంపిస్తుందని దుష్ప్రచారం
ప్రజల మధ్య విభజన సృష్టించి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు
కులగణనతో ఎవరి హక్కులు కాలరాయబోము
అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections)ప్రచారం లో ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ మోసగాడిగా అవతరించాడని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూట మి అధికారంలోకి వస్తే అయోధ్య లోని రామ మందిరంపైకి బుల్డోజ ర్‌ను పంపిస్తుందన్న ప్రధాని మోదీ(Modi) వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని గుర్తు చేశారు. ఈ దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ 55 ఏళ్లు పాలించిందని, ఏనాడూ ఏ ఒక్కరి మంగళసూత్రాన్నీ లాగే సుకోలేదనిలో అన్నారు. ఖర్గే ఓ ప్రైవే ట్ వార్తా సంస్థ ముఖాము ఖిలో మాట్లాడారు. ఎవరి విశ్వా సాలకూ తాము అడ్డు చెప్పలేదని, ఇవన్నీ తెలిసి కూడా ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

మా పార్టీ నేతలు ఎన్నడూ ఇంత బరితెగించి మాట్లా డలేదని ఖర్గే అన్నారు. పేదలు ఏ మతంలో ఉన్నా వారికి సాయం చేయడం బుజ్జగింపు కాబోదని చెప్పారు. బీజేపీ,(BJP) మోదీలు ప్రజల మధ్య విభజన సృష్టించి ఓట్లు కొల్ల గొట్టాలని చూస్తున్నాయని, ఓట్ల కోసమే వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. యూపీఏ(UPA) హయాంలో తీసుకువచ్చి న పథకాలతో పేదలకు తమ పార్టీ మేలు చేసిందని, దీనిపై కూడా బీజే పీ తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. గతంలో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం సహా అనేక పథకా లను తప్పుబట్టిన బీజేపీ ఇప్పుడు వాటిని తన ఘనతగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. తమిళనాడు మాదిరిగా 69% రిజ ర్వేషన్లు పెంచాలని భావిస్తున్నట్టు తెలిపారు.

పేదల కోసం చేస్తామంటే దానిని కూడా కూడా బీజేపీ వ్యతి రేక కోణంలో ప్రచారం చేస్తోందన్నా రు. కులగణనను ఖర్గే సమర్థించా రు, గతంలో నిరాదరణకు గురైన కులాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కులగణన చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎవరి హక్కులనూ కాలరాయబోమని స్పష్టం చేశారు. బీజేపీ మాత్రం ప్రతి విషయాన్నీ వక్రీకరించే పనిలో ఉందన్నారు.

భూసంస్కరణలు తెచ్చినప్పుడు, బ్యాంకులను జాతీయం చేసినప్పుడు కూడా యాగీ చేసిందని దుయ్యబట్టారు. బీజేపీ నేతలకు ఫ్యూడల్‌ మనస్త త్వం కలిగి ఉందన్నారు. మేనిఫె స్టో(Manifesto) లో ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉంటామని, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌లలో చేసి చూపుతున్నామని ఖర్గే చెప్పారు. పేదలకు తాము రూ.లక్ష ఇస్తామని చెబుతున్నామని ఇది వారి ఆర్థిక స్వావలంబనను పెంచు తుందన్నారు. ధనిక వర్గాల కు రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన బీజేపీ ప్రజలకు రూ.లక్ష ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. ఎన్డీయే(NDA) హయాంలో ఏం జరిగింది, దేశంపై రూ.155 లక్షల కోట్ల అప్పుల భారం పడిం దని, కాంగ్రెస్‌ హయాంలో ఈ అప్పు రూ.55 లక్షల కోట్లేనన్న విషయాన్ని వారు మరిచిపోతున్నారన్నారు. వారు చేసిన తప్పులు మరిచిపో తూ మాపై నిందలు మోపుతు న్నారని ఖర్గే వ్యాఖ్యానించారు.

Narendra Modi big fraud and lies