Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

yerravaram:ఎర్రవరం దూళ్లగుట్ట శ్రీ బాల ఉగ్రనరసింహ స్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తులు.

కోదాడ మండల పరిధిలోనిఎర్రవరం దూళ్లగుట్టపై వేంచేసి ఉన్న శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామిదేవాలయానికి భక్తులు శుక్రవారం దర్శనానికి పోటెత్తారు.

ప్రజా దీవెన, కోదాడ: కోదాడ మండల పరిధిలోనిఎర్రవరం దూళ్లగుట్టపై వేంచేసి ఉన్న శ్రీ బాల ఉగ్ర (Yerravaram Narasimha Swamy Temple) నరసింహస్వామిదేవాలయానికి భక్తులు (devotees)శుక్రవారం దర్శనానికి పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు కుటుంబ సభ్యులు అందరితో కలిసి స్వామివారిని దర్శించేందుకు ఎండను సైతం లెక్కచేయకుండా వివిధ ప్రాంతాల నుంచి  వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ముడుపులు, మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది చల్లటి తాగునీటిని అందిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఉదయం 9 గంటల పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

more devotees to yerravaram