Harish rao: బస్సు తప్ప అన్ని తుస్సు పథకాలే
నాలుగు నెలలోనే కాంగ్రెస్ మోసం బయట పడింది మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్ని అన్ని అబద్దాలే
రేవంత్ బండి ఇప్పుడు రివర్స్ గేర్ లో నడుస్తుంది
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచా రంలో హరీష్ రావు ధ్వజం
ప్రజా దీవెన, ఖమ్మం: నాలుగు నెలలోనే కాంగ్రెస్(Congress) మోసం బయట పడింది మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమా వేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన హరీష్ రావు(Harish Rao)మాట్లాడు తూ బస్సు తప్పా అన్ని పథకాలు తుస్సే అని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్ని అన్ని అబద్దాలే అన్నారు. కాంగ్రెస్ బండి ఇప్పుడు రివర్స్ గేర్ లో నడుస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కరెంటు 24 గంటలు ఇస్తే.. ఇప్పుడు 14గంటలు మాత్రమే వస్తుందని చెప్పారు.
కాంగ్రెస్(Congress) ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు తిరగబడతా రన్నారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగిం చాలని కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తు న్నాయని ఆరోపించారు. జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం రూ.100కోట్లు ఇస్తామన్న కాంగ్రెస్ రూ.100 రూపా యలు కూడా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి గుణ- పాఠం చెప్పనున్నా రని తెలిపారు. అబద్దాలు, మోసా లు, ఉన్న పథకాలు ఊదరగొట్టటం తప్పా.. కాంగ్రెస్ ప్రజలకు చేసింది. ఏమిలే దని విమర్శించారు.
తమ్మి నేని వీరభద్రం తీన్మార్ మల్లన్నకు(Tinmar Mallanna)మద్దతు తెలపడం ముదిగొండ అమరవీరుల ఆత్మ క్షోభిస్తుందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ అన్నారు. ప్రశ్నించే గొంతుక అని చెప్పుకునే తీన్మార్ మల్లన్న.. ఏ రోజైన పేద విద్యార్థుల కోసం మాట్లాడలేదన్నారు. 56 కేసులున్న తీన్మార్ మల్లన్న(Tinmar Mallanna)పట్టభద్రులగా ఎన్నుకుంటారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్, జాబ్ క్యాలెం డరు లేదని, తనను గెలిపిస్తే నిరుద్యోగుల, ఉద్యోగుల పట్ల ప్రశ్నించే గోతుకకై పోరాడుతా అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 46 ఎందుకు రద్దు చేయడం లేదని.. తాను ఎమ్మెల్సీ గా గెలిస్తే నా జీతంతో పేద విద్యార్థుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తా అని హామీ ఇచ్చారు.
Congress schemes are fail say Harish rao