Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Local body elections: స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంచాలి

తెలంగాణలో స్థానిక సంస్థల్లో 42 శాతం రిజ ర్వేషన్లు ఇవ్వకుండా ముందుకు వెళ్తే ఎన్నికలను అడ్డు కుంటామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చే యాలని బీసీ సంఘాల అల్టిమేటం
జూన్ 8న మహాధర్నాకు బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ పిలుపు

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణలో స్థానిక సంస్థల్లో 42 శాతం రిజ ర్వేషన్లు(Reservations) ఇవ్వకుండా ముందుకు వెళ్తే ఎన్నికలను అడ్డు కుంటామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా యాదవ సంఘం భవనంలో వివిధ బీసీ(BC caste), కుల సంఘాల నాయ కులతో కలిసి విలేఖరుల సమా వేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా రాజారాం యాదవ్ మాట్లా డుతూ అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా కామారెడ్డి(Kama reddy) విజయభేరీ సభ లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య చేతుల మీదుగా ప్రక టించిన బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలని అన్నారు.

కానీ లోక్ సభ ఫలితాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) నిర్వహించేం దుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని రాజారాం యాదవ్ ఆరోపించారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్, అధికార యంత్రాంగానికి సీఎం ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కులగణన, సామాజిక న్యాయం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందిన కాంగ్రెస్..మరోసారి బీసీలను(BC) మోసం చేసేందుకు సిద్ధమైందని విమర్శించారు. కులగణన చెయ్యకుండా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆగమేఘాల మీద స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు.

ముఖ్యంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, కులగణన బిల్లుకు చట్టబద్ధత కల్పించి, శాస్త్రీయ పద్ధతిలో కులగణన నిర్వహించాలని అన్నారు. అలాగే కులగణన విధివిధానాల కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు బీహార్(Bihar) రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయినా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైతే.. జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహాధర్నా కార్యక్రమం చేస్తామని, అప్పుడు కూడా మొండిగా వెళ్ళితే.. జూన్ 15న సెక్రటేరియట్ ను దిగ్బంధనం చేయనున్నట్టు రాజారాం యాదవ్ ప్రకటించారు. దశాబ్దాల సామాజిక వర్గాల న్యాయమైన డిమాండ్ సాధన కోసం తెలంగాణ తరహాలో మరో పోరాటానికి అంతా సిద్ధం కావాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ నేత చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కామారెడ్డి సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను నిజాయితీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా ఆ పార్టీలో ఉన్న నాయకులు కృషి చేయాలని కోరారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కుల, బీసీ సంఘాలు వివిధ స్థాయిల్లో పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే బీసీ జనసభ తలపెట్టిన జూన్ 8న మహాధర్నా, 15న సెక్రటేరియట్ ముట్టడికి బీసీ సంఘాలు, కుల సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుగు లక్ష్మీనారాయణ ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్(Mudiraj)సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మైదాసు సంజయ్, ఎంబీసీ జాతీయ కన్వీనర్ సత్యనారాయణ, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నేలపట్ల రమేష్, అడ్వాకేట్ జేఏసీ లొడంగి గోవర్ధన్ యాదవ్, టి.జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల క్రిష్ణ యాదవ్, యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు మామిడి పద్మ, కె.పర్వతాలు, ఎ. చంద్రయ్య, సంకరబోయిన శివకుమార్, పొడిశెట్టి అరవింద్, మునాస ప్రసన్నకుమార్, పి.ఆనంద్ గౌడ్, జి. దశరథ, వలకీర్తి శ్రీనివాస్, పగిళ్ల క్రిష్ణ, శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Reservations increased for BCs