Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Government departments: ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన

తెలంగాణలో ఎన్నికలు పూర్త వ్వడంతో ప్రస్తుతం పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి. ఆ క్రమంలోనే ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థాన చలనం కలిగించనున్నారా, అయా స్థానాల్లో సమర్థులైన అధికారులను నియమిస్తారా, ఇందుకోసం పాలనా యంత్రాంగంలో తహసీల్దార్‌ మొద లు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి దాకా అన్ని స్థాయుల్లో భారీ బదిలీ లకు కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. విశ్వసనీయవర్గాల పోగొట్ట మేరకు కసరత్తు ప్రారంభం ఇప్పటికే పూర్తయిందని తెలు స్తోంది.

జూన్ 11వ తేదీలోగా అన్ని శాఖల్లో పూర్తికి రంగం సిద్ధం
తహసీల్దార్‌ నుంచి ఐఏఎస్‌ వరకు సిద్ధమవుతున్న బదిలీల జాబితా
ఉద్యోగ సంఘాలతోనూ చర్చించి న రేవంత్ ప్రభుత్వం

ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికలు పూర్త వ్వడంతో ప్రస్తుతం పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి. ఆ క్రమంలోనే ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థాన చలనం కలిగించనున్నారా, అయా స్థానాల్లో సమర్థులైన అధికారులను నియమిస్తారా, ఇందుకోసం పాలనా యంత్రాంగంలో తహసీల్దార్‌ మొద లు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి దాకా అన్ని స్థాయుల్లో భారీ బదిలీ లకు కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. విశ్వసనీయవర్గాల పోగొట్ట మేరకు కసరత్తు ప్రారంభం ఇప్పటికే పూర్తయిందని తెలు స్తోంది.

జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ పూర్తవ్వగానే కోడ్‌ ముగు స్తుండగా జూన్‌ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ప్రభుత్వ యం త్రాంగంలో భారీ ప్రక్షాళన ఉంటుం దని, వరుసగా బదిలీల ఉత్తర్వులు వెలువడతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.రేవంత్‌ సర్కారు అధికారంలోకి రాగానే.. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ని బలోపేతం చేసింది. ఆ శాఖలో సమర్థులైన అధికారులతో పాటు కోర్టుల్లో కేసులు బలంగా నిలబడి, నిందితులకు శిక్షపడేలా పకడ్బందీ చార్జ్‌షీట్లు రూపొందించే సిబ్బంది, నిందితులు బెయిల్‌ పిటిషన్‌తో కోర్టులను ఆశ్రయిస్తే శక్తిమంతమైన కౌంటర్‌ వేసే సామర్థ్యమున్న సిబ్బం దిని ఏసీబీకి తీసుకొచ్చింది. దాంతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది మొదలు అవినీతి అధికారులపై దాడులు పెరిగిన విషయం తెలిసిందే.

ఆదాయానికి మించి ఆస్తులున్న అధికారుల అరెస్టులు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని శాఖల్లో ఉన్నతాధి కారులు మొదలు మధ్యస్థాయి అధికారులను బదిలీ చేయాలని రేవంత్‌ సర్కారు నిశ్చయించినట్లు తెలుస్తోంది.గత ప్రభుత్వ హయాం లో పలుమార్లు బదిలీలు జరిగినా.. ఒకేచోట తిష్టవేసిన వారిపై సర్కారు ఇప్పుడు దృష్టిసారించింది. కొత్త జిల్లాల విభజన సమయంలోనూ ‘ఆర్డర్‌ టు సర్వ్‌’ కింద సర్దుబాట్లు జరిగినా కొందరు ఒకేచోట ఉండి పోయారని గుర్తించింది. నిబంధనల ప్రకారం రెండేళ్లకు మించి ఒకేచోట పనిచేసేవారిని బదిలీ చేయాలి.

ఈ క్రమంలో ఆర్థిక, రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యం, పురపాలక, పట్టణా భివృద్ధి, వ్యవసాయం, విద్యుత్తు, పంచాయతీరాజ్‌, రోడ్లు–భవనాలు, రవాణా ఇలా అన్ని శాఖల్లో బదిలీ లు చేపట్టేందుకు సర్కారు సిద్ధమై నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకరిద్దరు కీలక ఐఏఎస్‌ అధికా రులను, పెద్ద సంఖ్యలో ఐపీఎస్‌ల ను బదిలీ చేయనున్నట్లు సమా చారం. పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్లు మొదలు ఎస్పీల దాకా రెవెన్యూ శాఖలో తహసీల్దార్‌ మొదలు ఆర్‌డీవో, డీఆర్‌వో, కలెక్టర్‌ వరకూ బదిలీలు ఉంటాయని స్పష్టమ వుతోంది. అటు పంచాయతీరాజ్‌ శాఖలో ఎక్స్‌టెన్షన్‌ అధికారుల తోపాటు డివిజనల్‌ పంచాయతీ ఆఫీసర్లు, జిల్లా పంచాయతీ ఆఫీసర్లు(డీపీవో), జిల్లా పరిషత్‌ చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్లకు స్థానచ లనం తప్పదని తెలుస్తోంది.

మరోవైపు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖలో(Stamps-Registrations Department) కొంత మంది సబ్‌–రిజి స్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీ లను బదిలీ చేయనుంది. ఈ శాఖలో 2023 ఆగస్టులో భారీస్థా యిలో బదిలీ జరిగాయి. కొంత మంది సబ్‌–రిజిస్ట్రార్లు, కింది స్థాయిలో అధికారుల బదిలీలు జరగలేదు. వీరి వల్ల సబ్‌–రిజిస్ట్రా ర్‌ కార్యాలయాలకు చెడ్డ పేరు వస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇలాంటివారిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని సమాచారం. వీటితో పాటు ఇంటెలిజెన్స్‌ నివేదికలు, ఉద్యోగ సంఘాల నేతలతో అంతర్గ త చర్చలు జరిగిన సమయంలో సేకరించిన వివరాలను తాజా బదిలీల్లో పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నట్లు సచివాలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Revanth reddy transfared in Department of Govt