Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gujarat fire incident: ఘోర అగ్నిప్రమాదం మరణ మృదంగం

గుజరాత్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వారాంతంతో పాటు సాయంకాల సంధ్యా వందనంలో పిల్లా పాపలతో సరదాగ గడుపుదా మనుకున్న సమయంలో విధి వక్రీక రించి ఆశలు ఆవిరయ్యాయి.

దట్టమైన పొగ,మంటల్లో చిక్కు కొని 27 మంది సజీవ దహనం
గుజరాత్ రాజ్ కోట్ లో చోటుచే సుకున్న పెను విషాదం
తల్లితండ్రుల కళ్ళ ముందే చిన్నా రుల సజీవదహనం
ఓ మాల్‌లోని గేమింగ్‌ జోన్‌లో ఈ ఘోర అగ్ని ప్రమాదం
అనుమతుల్లేకుండానే జోన్‌ నిర్వ హణ, మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం
అగ్నిప్రమాద దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, విచారం

ప్రజా దీవెన, రాజ్‌కోట్‌: గుజరాత్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వారాంతంతో పాటు సాయంకాల సంధ్యా వందనంలో పిల్లా పాపలతో సరదాగ గడుపుదా మనుకున్న సమయంలో విధి వక్రీక రించి ఆశలు ఆవిరయ్యాయి. తల్లి తండ్రులు, పిల్లలు కలసి అక్కడికి సరదాగా కాసేపు ఆడుకునేందుకు వచ్చిన పిల్లలు గానీ వారు ఆడు కుంటుంటే చూస్తూ ముచ్చట పడు తున్న తల్లిదండ్రులు(Parents) గానీ కాసేపట్లో చుట్టుముట్టే మంటల్లో చిక్కుకొని సజీవదహనమైన ఘోర దుర్ఘటన గుజరాత్(Gujarat Rajkot) రాజ్ కోట్ లో చోటుచేసు కుంది. ఎవరి ఊహకండకుండా జరి గిన ఈ ఘోర అగ్నిప్రమాదం మరణ మృదంగాన్ని సృష్టించింది. దట్టమైన పొగ,మంటల్లో చిక్కుకొని 27 మం ది సజీవ దహనమయ్యారు.

గుజ రాత్ రాజ్ కోట్ లో చోటుచేసుకున్న పెను విషాద సంఘటనలో తల్లితం డ్రుల కళ్ళ ముందే చిన్నారుల సజీ వదహనమయ్యారు. ఓ మాల్‌ లో ని గేమింగ్‌ జోన్‌లో ఈ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అనుమ తుల్లేకుండానే జోన్‌ నిర్వహిస్తుం డ గా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అ వకాశం ఉంది. సంఘటన పూర్వ పరాలిలా ఉన్నాయి. కంప్యూటర్‌ గేమ్స్‌లో కొందరు, జారుడు బల్లా టలో మరికొందరు, బొమ్మ కార్లలో తిరుగుతూ ఇంకొందరు ఇలా కేరిం తలు కొడుతూ ఆడుకుంటున్న పిల్ల లు, వారి సంబంధీకులున్న గేమ్‌జో న్‌ను అకస్మాత్తుగా మాయదారి అగ్ని కీలలు చుట్టుముట్టాయి.

అక్కడున్న వారంతా ప్రాణభయం తో తప్పించు కునేందుకు పరుగులు పెట్టినా అప్పటికే వ్యాపించిన దట్టమైన పొగ, మంటల్లో చిక్కు కుపోయి 27 మంది ప్రాణాలు కో ల్పోయారు. మృతుల్లో సగానికి పైగా పిల్లలున్నారు. టీఆర్పీ పేరుతో నిర్వహిస్తున్న ఓ మాల్‌లోని గేమింగ్‌ జోన్‌లో ఈ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన ప్పుడు గేమింగ్‌(Gaming zone) జోన్‌ లోపల 60 మందిదాకా ఉన్నారు. 20 మందిని అధికారులు రక్షించారు. ఇంకా కొందరు లోపలే ఉండటంతో మృతు ల సంఖ్య పెరిగే అవకాశం ఉందం టున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షత గాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈగే మింగ్‌ జోన్‌ను పూర్తిగా కలపతో నిర్మించడంతో మంటలు వేగంగా వ్యాపించి అక్క డున్నవారు తప్పించుకునేందుకు వీల్లేకుండా పోయిందని, ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు చెప్పారు.

గేమింగ్‌ జోన్‌కు(Gaming zone) మంటలు వ్యాపించడం లోపల పిల్లలు చిక్కు కు పోవడంతో బయట ఉన్న తల్లి దండ్రులు రక్షించండంటూ కేకలు వేశారు. పిల్లలు కళ్లముందే కాలి బూడవుతుంటే కంటికీమంటికి ధారగా రోదించారు. అగ్ని ప్రమా దాని కి కారణాలు తెలియరాలేదు. ఈ గేమ్‌జోన్‌ నిర్వహణకు ఎలాంటి అనుమతులూ తీసుకోలేదని అధి కారులు గుర్తించారు. దాని నిర్వా హకులను అదుపులోకి తీసుకు న్నారు. రాజ్‌కోట్‌(Rajkot)ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియ జేశారు. ప్రమా ద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశా రు. ప్రమాద ఘటనపై గుజరాత్‌ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. బాధ్యు లపై కఠిన చర్యలు తీసు కుంటామని ఆ రాష్ట్ర సీఎం పటేల్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తర ఫున మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు చెప్పారు.

Gujarat rajkot fire incident