Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC by-election polling: ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

వరంగల్ -ఖమ్మం- నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి,వరంగల్-ఖమ్మం- నల్లగొండ, నల్లగొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి దాసరి హరి చందన తెలిపారు.

పట్టుభద్రుల ఉప ఎన్నికల రిటర్నిం గ్ అధికారి దాసరి హరిచందన

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: వరంగల్ -ఖమ్మం- నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి,వరంగల్-ఖమ్మం- నల్లగొండ, నల్లగొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి దాసరి హరి చందన(Dasari Hari Chandana)తెలిపారు. ఆదివారం ఆమె నల్లగొండ జిల్లా కేంద్రంలోని సెయిం ట్ ఆల్ఫాన్సెస్ పాఠశాలలో ఏర్పా టు చేసిన ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల సామా గ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రంలో బ్యాలె ట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది తరలింపు ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వరంగల్ ఖమ్మం నల్లగొండ శాసనమండలి పట్టభ ద్రుల ఉప ఎన్నికలకు నల్లగొండ జిల్లాతో పాటు ఎన్నికలు జరిగే 12 జిల్లాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.

శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక్షల పోలింగ్(Polling) ఉదయము 8 గంటల నుండి సాయంత్రం 4:00 వరకు జరుగుతుందని, నియో జకవర్గ పరిధిలో మొత్తం నాలుగు లక్షల 63839 మంది ఓటర్లు నమోదై ఉన్నారని, వారు వారి ఓటు హక్కును వినియోగించుకో నున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని, ముఖ్యంగా ఇతర ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికల కు తేడా ఉందని, ఎం ఎల్ సి ఎన్నికలలో ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు ఓటు(Vote) వేయాల్సి ఉంటుందని, ఎం ఎల్ సి ఎన్నిక్షలలో ఎలా ఓటు వేయాలో క్షుణ్ణంగా తెలుసుకోవాలని తెలిపారు. ఇందుకు గాను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసే విషయంపై ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోస్టర్ తో పాటు, ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఓటరు వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా 1,2,3,4, ప్రాధాన్యత క్రమంలో మాత్రమే అంకెల రూపంలో ఓటు వేయాల్సి ఉంటుందని తెలిపారు.

పోలింగ్ కేంద్రాలలో సిబ్బందికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్లో పరిధిలో 144 సెక్షన్ విధించడం జరిగిందని, ఎన్నికల ప్రవర్తన నియమావళి పై అన్ని పార్టీలకు, పోటీలో ఉన్న అభ్యర్థులకు వివరాలన్నింటిని ఇదివరకే తెలియజేయడం జరిగిందని, ఎం ఎల్ సి ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అందరు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్స్ లు,(Ballot box)ఇతర సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల అశనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర , నల్లగొండ, మిర్యాలగూడ, చండూరు, దేవరకొండ ఆర్ డి ఓ లు, డిఆర్డిఓ నాగిరెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్ ఇతర అధికారులు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

MLC by-election arrangements completed