Amit shah: మళ్లీ మేమొస్తున్నాం…. జమిలి ఎన్నికలు ఖాయం
కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే లోక్ సభ, అసెంబ్లీలకు ఒకేసా రి జమిలి ఎన్నికలు (ఒక దేశం-ఒకే ఎన్నిక) నిర్వహిస్తామని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ స్పష్టం చేశారు.
అమలులోకి ఉమ్మడి పౌరస్మృతీ
యూసీసీ, ముస్లిం కోటాపై మాట్లా డితే ‘మత’ ప్రచారమా
ఏపీలో 17 ఎంపీ స్థానాలు గెలు స్తాం, అక్కడ మాదే అధికారం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే లోక్ సభ(Lok sabha), అసెంబ్లీల(Assembly )కు ఒకేసా రి జమిలి ఎన్నికలు (ఒక దేశం-ఒకే ఎన్నిక) నిర్వహిస్తామని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ స్పష్టం చేశారు. అలాగే దేశవ్యా ప్తంగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీ సీ)ని కచ్చితంగా అమలు చేస్తామ న్నారు. జూన్ 1న తుది విడత పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఆదివారం ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. యూసీసీ స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ రూపకర్తలు పార్లమెంటు, శాసనసభలకు వదిలివెళ్లిన బాధ్య తగా పేర్కొన్నారు. ‘రాజ్యాంగ సభ మనకు నిర్దేశించిన నియమాల్లో ఉమ్మడి పౌరస్మృతి కూడా ఉంది. లౌకికదేశంలో మతప్రాతిపదికన చట్టాలు ఉండకూడదని అప్పట్లో కేఎం మున్షీ, బాబూ రాజేంద్ర ప్రసాద్, బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా చెప్పారు.
ఉమ్మడి పౌర స్మృతి అనేది భారీ సామాజిక, చట్ట, మతపరమైన సంస్కరణ. ఉత్తరాఖండ్ లో బీజేపీ(BJP govt) ప్రభుత్వం దీనిపై ఓ ప్రయోగం చేపట్టింది. ఈ చట్టంపై విస్తృత చర్చ జరుగుతోం ది. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే న్యాయస్థానం అభిప్రాయం కూడా తెలుస్తుంది. ఆ తర్వాత రాష్ట్రాల శాసనసభలు, దేశ పార్లమెంటు యూసీసీని తీసుకురావాలి. ఇం దుకే మా సంకల్ప పత్ర (మేనిఫె స్టో)లో యూసీసీని చేర్చాం.వచ్చే ఐదేళ్లలో దీనిని పూర్తిచేస్తాం’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. అలా గే జమిలి ఎన్నికలపైనా చర్చించా ల్సి ఉందన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సారథ్యంలో ప్రధాని మోదీ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ఇప్ప టికే సమర్పించిందని గుర్తుచేశారు. లోక్సభ ఎన్నికల సమయం మార్పు పైనా ఆలోచన చేస్తామన్నారు.
హ్యాట్రిక్ ఖాయమని అమిత్ షా తెలిపారు. తాము మతప్రాతి పదికన ప్రచారం చేయడం లేదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 అధికరణ రద్దు, యూసీసీ, మత ప్రాతిపదికన ముస్లిం కోటాను వ్యతిరేకించడం మత ప్రచారమే అయితే బీజేపీ కచ్చితంగా అదే పనిచేస్తుందని తేల్చిచెప్పారు. పోలింగ్ డేటా, ఈవీఎంలపై విపక్షాలు అనవసరంగా యాగీ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ సహా గతంలో అనేక ఎన్నికల్లో ఇవే అమలయ్యా యని బీజేపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. ఓటమి తప్పదన్న భయం తోనే విపక్షాలు ముందస్తుగా ఏడుస్తున్నాయని జూన్ 5 తర్వాత విదేశాలకు విహార యాత్రలకు వెళ్లేందుకు సాకులు వెతుక్కుంటు న్నాయని అందుకే ఏదో ఒకటి మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు. తమ అగ్ర నేత రాహుల్ గాంధీ వైఫల్యాలను కప్పిపుచ్చు కునేందుకు కాంగ్రెస్ ఇలాంటి ప్రశ్న లు లేవనెత్తుతోం దన్నారు. ఈవీఎం లతో రిగ్గింగ్ సాధ్యం కాదని రిగ్గింగ్ జరిగే విధానం కావాలని కాంగ్రెస్ అడుగుతోందని మండిపడ్డారు.
ఒడిసా, అరుణాచల్లో మేమే
జూన్ 4న వెలువడే ఫలితాల్లో ఎన్డీయే 400 సీట్ల లక్ష్యాన్ని కచ్చి తంగా సాధిస్తుందని అలాగే ఆంధ్ర ప్రదేశ్, ఒడిసా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో(Arunchal pradesh) కూడా బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాలు ఏర్పాటవుతాయని అమిత్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్ సభ స్థానాల్లో ఎన్డీయేకి 17, 175 స్థానాల ఆంధ్ర అసెంబ్లీలో కూడా తమ కూటమే అధికారం చేజిక్కించుకుంటుందని స్పష్టం చేశారు. తమిళనాడులో ఈ సారి తమ ఓట్లు, సీట్లు పెరుగుతాయని, కేరళలో ఖాతా తెరుస్తామని చెప్పా రు. మోదీ పైన బీజేపీ అతిగా ఆధా రపడుతోందా అని ప్రశ్నించగా బీజేపీ(BJP) మౌలిక సైద్ధాంతిక ఆలోచనలను మోదీ సాకారం చేశారని, ఆయన తమకు అతిపెద్ద నాయకుడని చెప్పారు. ముస్లిం(Muslims reservations) రిజర్వేషన్పై కాంగ్రెస్(congress) అసత్యాలతో దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఆ పార్టీ దానిని అమలు చేసిందని తెలిపారు. కాగా, వచ్చే 2-3 ఏళ్లలో దేశంలో నక్సల్స్ సమ స్య అంతమవుతుందని అమిత్ చెప్పారు. ప్రస్తుతం ఛత్తీగఢ్ లో ఓ చిన్న ప్రాంతంలో తప్ప మిగతా దేశంలో ఈ సమస్య అంతరిం చిందన్నారు.
Amit shah says one election one india