Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Heavy rains: గాలి.. వాన బీభత్సం

రాష్ట్రవ్యాప్తంగా ఊహించని గాలి వాన బీభత్సం సృష్టించింది. బల మైన ఈదురుగాలులతో కూడిన వానకు ప్రజలు బిక్కు బిక్కు మం టూ గడిపారు.

ఆదివారం అతలాకుతలం
ఉరుములు, మెరుపుల( thunder and lightning) వానతో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం
కూలిన చెట్లు, స్తంభాలు,ఇంటి పైకప్పులు ఎగిరిపడ్డ వైనం
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో తీవ్రత అత్యధికం
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో షెడ్డు గోడ కూలి నలుగురు,పిడుగుపాట్లకు ఇద్దరు రైతులు, బాలుడి దుర్మరణం
సిద్దిపేట జిల్లాలో కోళ్లఫారం గోడ కూలడంతో ఇద్దరు, మేడ్చల్‌ జిల్లా లో బైక్‌పై కొమ్మలు పడి మరణం

ప్రజా దీవెన, హైదరాబాద్:   రాష్ట్రవ్యాప్తంగా ఊహించని గాలి వాన(Heavy rains) బీభత్సం సృష్టించింది. బల మైన ఈదురుగాలులతో కూడిన వానకు ప్రజలు బిక్కు బిక్కు మం టూ గడిపారు. గాలివాన తీవ్రత ఉమ్మడి పాలమూరులో అత్యధికం గా ప్రభావం చూపడంతో పాటు నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలి నలుగురు మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన మల్లేష్‌ (38) రెండు నెలల క్రితం పొలంలో షెడ్డు నిర్మాణం చేపట్టగా పక్క గోడలు నిర్మిస్తు న్న క్రమంలో మల్లేష్‌, భార్య పార్వత మ్మ, కుమారుడు రాజు, కుమార్తె అనూష (11) అక్కడికి వచ్చారు. కూలీలతో కలిసి పనిచేస్తుండగా వర్షం ప్రారంభం అవడంతో గోడ పక్కన తలదాచుకున్నారు.

ఇంత లోనే అది కూలి నలుగురు మృతి చెందారు. ఇదిలా వుండగా హైదరా బాద్‌(Hyderabad) నగర శివారు హయత్‌నగర్‌, వనస్థలిపు రం, బీఎన్‌రెడ్డినగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర ప్రాంతా ల్లో 20 నిమిషాల పాటు 40–50 కిలో మీటర్ల వేగంతో వీచిన ఈదు రు గాలులకు పెద్ద సంఖ్యలో భారీ వృక్షాలు నేలకూలాయి. ఓ దశలో మనిషి కొట్టుకుపోతారా, అనేంత వేగంతో గాలి వీచింది. గంటలపాటు విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. వర్షం పది నిముషాలే పడింది. కానీ బలంగా వీచిన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వనస్థలి పురం గణేష్‌ ఆలయం(Ganesh temple) రోడ్డులో భారీ చెట్టు పడడంతో వాహనాల రాకపోకలు గంటకుపైగా నిలిచి పోయాయి. కార్లు పాక్షికంగా ధ్వంస మయ్యాయి. ఇళ్లపై రేకులు కొట్టుకు పోయాయి. హయత్‌నగర్‌–1 డిపో లో భారీ వృక్షం పడడంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతి న్నది.

డ్రైవర్ల రెస్ట్‌రూంల పై కప్పు రేకులు విరిగిపోయాయి. డిపోలో సైతం భారీ వృక్షం కూలి డిపో ప్రహ రీ గోడ ధ్వంసమైంది. రాయదుర్గం, గచ్చిబౌలి, టీఎన్‌జీవో కాలనీ, గౌర వెలి ప్రాంతాల్లో ఈదురు గాలుల తీవ్రతకు స్థానికులు భయాందోళన కు గురయ్యారు. తీగలపై చెట్లు పడ డంతో విద్యుత్‌ స్తంభాలు విరిగిపో యాయి. 3–4 గంటల పాటు సరఫ రా నిలిచిపోయింది. నగరంలో మధ్యాహ్నం 3 గంటలకు పలు ప్రాం తాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత(Temparature) ఉండగా మరికొన్నిచోట్ల వర్షం కురవడం గమ నార్హం. గచ్చిబౌలి, నానక్‌రామ్‌ గూడ, ఖాజాగూడ, రాయదుర్గం, కొత్తగూడ, కొండాపూర్‌, లింగంపల్లి, తారానగర్‌, మియాపూర్‌, చందాన గర్‌లో రోడ్లన్నీ జలమయమ య్యా యి. ఐకియా, బయో డైవర్సిటీ, కొండాపూర్‌ సర్కిల్‌, గచ్చిబౌలి ఔటర్‌ సర్కిల్‌ తదితరచోట్ల, ట్రాఫిక్‌ స్తంభించింది.

ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఉధృతం… ఉమ్మడి మహబూ బ్‌నగర్‌ జిల్లాలో గాలివాన(air and rains) ఉదృతమై తీవ్ర ప్రభావం చూపింది. భూత్పూర్‌ మునిగిరంగస్వామి ఆలయ ధ్వజ స్తంభం పడిపోగా జడ్చర్ల కొత్త బస్టాండులోని చెట్టు విరిగిపడి కారు, ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. నవాబ్‌ పేట, కోస్గి, గద్వా ల మండలాల్లో విద్యు త్ స్తంభాలు విరిగాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇళ్ల కప్పులు ఎగిరి పోయాయి. ప్రధాన కూడళ్లలో హోర్డింగ్‌లు ఫ్లెక్సీలు చిరిగిపోగా, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల అద్దాలు ధ్వం సమయ్యాయి. పీఏపల్లి, చందం పేట, చండూరు మండలాల్లో గాలు లు విధ్వంసం సృష్టించాయి. చౌటు ప్పల్‌ యార్డులో ధాన్యం తడిసి ముద్ద అయింది. నిజామాబాద్‌ జిల్లా అంబం నుంచి రుద్రూరు వెళ్లే దారిలో భారీ చెట్లు పడటంతో ఆటో, రెండు బైక్‌లు ధ్వంసమ య్యాయి. వికారాబాద్‌ జిల్లాలోని బొంగ్లూరు చౌరస్తా వద్ద సాగర్‌ రహదారిపై షాపులపై ఉన్న లైటింగ్‌ బోర్డులు పడిపోయాయి.

బొంరాస్‌ పేట మండలం పోలెపల్లిలో ఎల్లమ్మ ఆలయం ధ్వజస్తంభం విరిగి కిందప డింది. దారూరు మండలం కుమ్మ ర్‌పల్లి గ్రామంలో అంజనేయస్వామి ఆలయ గోపురం కిందపడి దెబ్బ తిన్నది. వారిపై పడింది. మల్లేష్‌, అనూషతో పాటు పెద్దకొత్తపల్లి మండలం ముష్ఠిపల్లికి చెందిన కూలీలు చెన్నమ్మ(37) రాములు (40) అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ గా మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా తిమ్మాయిపల్లిలో ద్విచక్ర వాహనం పై వెళ్తున్న ఇద్దరిపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. యాదాద్రి జిల్లా బొమ్మలరామారంకు చెందిన నాగి రెడ్డి, రామిరెడ్డి, ధనంజయ్య కీసర నుంచి శామీర్‌పేట వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బైక్‌ నడుపుతున్న రామిరెడ్డి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. తోటి ప్రయాణికులు గమనించి ధనంజయ్యను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

చుట్టపు చూపుగా వచ్చినం దుకు… బంధువుల ఇంట దావ త్‌కు వచ్చిన ఇద్దరిని మృత్యువు వెంటాడింది. సిద్దిపేట జిల్లా తూప్రా న్‌ మండలం గణపురం గ్రామానికి చెందిన గంగ గౌరీశంకర్‌ (30), చంద్రాయణగుట్ట వాసి భాగ్య(40) ములుగు మండలం క్షీరాసాగర్‌లోని చుట్టాల వద్దకు వచ్చారు. వారి పొలం వద్దకు వెళ్తుండగా వర్షం మొదలైంది. దీంతో పక్కనే ఉన్న పాత కోళ్లఫారం వద్దకు చేరుకు న్నారు. ఈదురుగాలులకు గోడ కూలడంతో గౌరీశంకర్‌, భాగ్య అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాల య్యా యి.గాలివాన బీభత్సానికి రేకుల షెడ్డుపై ఉన్న సిమెంట్‌ ఇటుక వాహ నంపై పడి కారు డ్రైవర్‌ మృతి చెందాడు. వికారాబాద్‌ జిల్లా బషీర్‌బాద్‌ మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన వేణు (34) ప్రయాణికులతో శ్రీశైలానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. నాగర్‌కర్నూల్‌ సమీపంలోని మంతటి చౌరస్తా దగ్గర రోడ్డు పక్కనున్న షెడ్డుపై నుంచి సిమెంటు ఇటుకలు వేణు నడుపుతున్న వాహనంపై పడ్డాయి. అద్దం పగిలడంతో తీవ్ర గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పిడుగుపాటుకు(thunder and lightning) గురైన రెైతు లు… నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినే పల్లి మండలం నంది ఒడ్డెమాన్‌లో రైతు అంజన్‌రెడ్డి (49), తిమ్మాజీ పేట మండలం మారేపల్లిలో రైతు కుమ్మరి వెంకటయ్య (55)లు పొలం లో పనిచేస్తుండగా వర్షం ప్రారంభం కోవడంతో సమీపంలోని చెట్ల కింద కు తలదాచుకునేందుకు వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడటం తో ప్రాణాలు కోల్పోయారు. తెలకప ల్లికి చెందిన మేకల కాపరి వెంకట య్యకు భోజనం తీసుకెళ్లిన అతడి కుమారుడు దండు లక్ష్మణ్‌ (12) తిరిగొస్తుండగా వర్షం పడడంతో చెట్టు కింద నిల్చున్నాడు. పిడుగు పాటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. కోస్గి మండలం తొగాపూ ర్‌లో రెండు కోడెదూడలు పిడుగు పాటుతో మృతి చెందాయి. కుమ రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచిక లపేట మండలం కొండపల్లిలో బండిపై పిడుగుపడడంతో ఎల్కరి సత్తన్నకు చెందిన రెండు ఎడ్లు చనిపోయాయి.

Severe power outage due to thunder and lightning