Phone tapping: ముచ్చటగా మూడోసారి అధికారమే పరమావధిగా
దేశ వ్యా ప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిం చిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చి లికి చిలికి గాలి వానలా మారింది.
ఫోన్ ట్యాపింగ్ నేరాంగీకార వాం గ్మూలంలో రాధాకిషన్
కేంద్రంతో బెరసరాల కోసమే ఫోన్ టైపింగ్ వ్యవహారం
బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ అరెస్టుకు కేసీఆర్ ఆదేశం
కేరళలో ఓ కీలక వ్యక్తి అరెస్ట్కు
ప్రత్యేక విమానంలో రాష్ట్ర పోలీ సులు
సదరు వ్యక్తి తప్పించుకోవడంతో ప్రణాళిక విఫలం, ఎమ్మెల్యేల కొను గోలు కేసు దర్యాప్తు విఫలం
బీజేపీ సంప్రదించింది ఒక్క రోహి త్ రెడ్డిని మాత్రమే
కేసీఆర్ కనుసన్నల్లో తెరపైకి రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్దన్ రెడ్డి, పట్నం మ హేందర్ రెడ్డి, భార్య సునీతపై నిఘా
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు, కడియం, శంబీపూర్ రాజు ఫోన్లూ ట్యాప్
టెలిగ్రాఫ్ చట్టానికి విరుద్ధమని తెలిసే తాము ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డామన్న రాధాకిషన్
ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ వ్యా ప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిం చిన ఫోన్ ట్యాపింగ్(Phone tapping) వ్యవహారం చి లికి చిలికి గాలి వానలా మారింది. ఫోన్ టాపింగ్ కేసులో తవ్వేకొద్దీ కొత్త కొత్త తెరచాటు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు లను పావుగా వాడుకుని బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్ ముచ్చటగా మూ డోసారి అధికారం దక్కించుకు నేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవ హారం పక్కా ప్రణాళిక బద్దంగా అమలుచేశారు. సదరు విషయా లన్నీ ఇప్పుడిప్పుడే అనేక మార్గాల్లో వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానం గా నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి పలు కొత్త విషయాలను రాధాకిషన్రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు.
ఆ మేరకు ప్రకారం మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొను గోలుకు బీజేపీ యత్నించిందని ఇప్పటి వరకూ చాలామంది భావి స్తున్న తరుణంలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెరపరుస్తున్నాయి. వెలుగు చూసిన వాస్తవాల ప్రకారం బీజేపీ పైలెట్ రోహిత్ రెడ్డితో(Rohit Reddy) మాత్ర మే సంప్రదింపులు జరిపగాఈ విష యం కేసీఆర్కు తెలియడంతో వేర్వే రు సామాజికవర్గాలకు చెందిన మ రో ముగ్గురు ఎమ్మెల్యే లను ఇందు లో భాగం చేయాలని ఆదేశించినట్టు రాధాకిషన్రావు తెలిపారు. ఎమ్మె ల్యేల కొనుగోలు వ్యవహారంలో కీల కంగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను అరె స్టు చేసి కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పించడానికి కేంద్రంతో బేర సారాలు ఆడాలన్నది కేసీఆర్ పక్కా ప్రణాళిక అని రాధా కిషన్ వాంగ్మూలం ప్రకారం సుస్పష్టం.
తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను(MLC Kavitha) ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయట పడేసేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ అరెస్టుకు నాటి సీఎం కేసీఆర్ స్కెచ్ వేశారన్నది, బీజేపీ అధిష్ఠానంతో నేరుగా బేరసారాలు ఆడేందుకే ఆ ప్రణాళిక అమలు చేసేందుకు సిద్ధమయ్యారా అనే అనుమానా లకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నింది తుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలం నూటికి నూరు పాళ్లు నిజమని స్పష్టం చేస్తుంది. కేసీఆర్ వేసిన ప్రణాళిక పోలీసుల వైఫల్యంతో ఫెయిలయిందని తన నేరాంగీకార వాంగ్మూలం (కన్ఫెషన్ స్టేట్మెం ట్)లో ఆయన పలు సంచ లన విషయాలను వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తి కేరళలోని మాతా అమృతానం దమయి ఇన్స్టిట్యూట్లో ఉన్న వ్యకిని అరెస్టు చేసేందుకు సైబరా బాద్ ఎస్వోటీ పోలీసులు కేరళకు వెళ్లగా అయన తప్పించుకున్నారు.
సదరు వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, ఇన్స్పెక్టర్ గట్టుమల్లుతోపాటు, ఇతర అధికారులను చార్టర్డ్ విమా నంలో కేరళకు పంపినా ప్రణాళిక విజయవంతం కాకపోవడంతో నిరాశ కలిగించింది. అంతలోనే న్యాయస్థానం ఈ కేసును సిట్ నుంచి బదిలీ చేసి సీబీఐకి(CBI)అప్పగిం చింది. ఈ సమయంలో అనుకున్న విధంగా పని జరగకపోవడంతో పెద్దాయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని రాధాకిషన్ తన వాం గ్మూలంలో పేర్కొన్నారు. దేశాన్ని కుదిపేసిన ఎమ్మెల్యే కొనుగోలు కేసు లో మేము కీలకంగా ఉన్నామని, మొయినాబాద్(Moinabad)ఫామ్హౌస్లో 2022 అక్టోబర్ చివరి వారంలో ఈ సంఘటన జరిగిన సమయంలో మునుగోడు ఉప ఎన్నిక జరుగు తోందని చెప్పారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే గా ఉన్న రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy)పార్టీని వీడి బీజేపీలో చేరారడం, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి ఊపుమీద ఉన్న బీజేపీని మునుగోడులో ఓడించాలని కేసీ ఆర్ ఆ సీటును ప్రతిష్ఠాత్మకం గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో బీజేపీకి చెందిన కొందరు టచ్లోకి వెళ్లారని, పార్టీ మారేందు కు ఆయన్ను ప్రలోభాలకు గురిచేస్తు న్నారంటూ సీఎం కేసీఆర్ నుంచి సమాచారం వచ్చిందని ప్రభాకర్ రావు నాతో చెప్పారు. బీజేపీని ఇరుకున పెట్టే అవకాశాన్ని వదులు కోవడం ఇష్టంలేని కేసీఆర్(KCR) ఎమ్మెల్యే తోపాటు బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయాలని సూచించారు. ఈ పనిని ప్రణీత్ రావుకు అప్పగించి వారి ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు కొన్ని ఆడియో క్లిప్లను సేక రించి పంపగా అవే ఆడియో క్లిప్ లను సీఎం కేసీఆర్కు ఇచ్చామని, తమకు అనుకూలంగా పనిచే యా లంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని సూచించిన సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నాయకుల చుట్టూ ఉచ్చు బిగించాలని పథకం వేశారు.
ఇందులో భాగంగానే వేర్వే రు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను తెర పైకి తీసుకొచ్చారు. కేసీఆర్ ఆదేశా లతోనే పైలెట్ రోహిత్ రెడ్డి మరో ము గ్గురు ఎమ్మెల్యేలతో కలిసి బీజే పీ నేతల తరఫున వచ్చిన నేతలతో సంప్రదింపులు జరిపారు. వీరి వ్యవ హారం రికార్డ్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్సై శ్రీకాంత్ను ఢిల్లీ పంపి కెమెరాలను తెప్పించి, సమావేశానికి ఒక రోజు ముందు ఫామ్హౌస్లో బిగించార ని రాధాకిషన్ రావు వివరించారు.
అంతా నా చేతులతోనే….
పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును గత ప్రభుత్వ పెద్దలు కావా లనే ఇంటెలిజెన్స్ చీఫ్గా (ఓఎస్డీ) నియమించినట్టు రాధాకిషన్రావు వెల్లడించారు. ఆయన ఇంటెలిజె న్స్కు వచ్చిన తర్వాతే నాతో సహా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ, టాస్క్ఫోర్స్కు తీసుకొచ్చారు. నాది కూడా అదే సామాజిక వర్గం కావ డంతో అప్పటి ప్రభుత్వం నాకు మూడేళ్లు టాస్క్ఫోర్స్ డీసీపీ (ఓఎస్డీ)గా అవకాశం ఇచ్చింది’’ అని తెలిపారు. ముఖ్యంగా భుజం గరావు, తిరుపతన్న, ప్రణీత్రావు, వేణుగోపాల్ రావు ప్రత్యేక టీమ్ల ను ఏర్పాటు చేసుకొని లీడ్ చేశార ని చెప్పారు. టాస్క్ఫోర్స్పరంగా తాను మొత్తం వ్యవహారం దగ్గరుం డి నడిపించానని రాధాకిషన్ రావు తెలిపారు.
ముమ్మాటికీ చట్టవిరుద్దామని తెలిసినా…. టెలిగ్రాఫ్ చట్టానికి విరుద్ధం అని తెలిసే తాము ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డామని ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు పోలీసు లకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలి పారు. తాము చేస్తున్నది చట్టవి రుద్ధం అని తెలుసు కాబట్టి ఈ విష యంలో అత్యంత గోప్యత పాటించే వారమ ని వాట్సాప్లో వీవోఐపీ (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటో కాల్) ద్వారా మాట్లాడుకునే వార మని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీనే మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో ఉన్నాము కానీ, ఆ పార్టీ ఓడిపోవడంతో చట్ట పరంగా ఎదురయ్యే పర్యవసా నాలను ఊహించి ప్రభాకర్ రావు తమను అప్రమత్తం చేశారని దీంతో తామందరం ఒకరి నొకరు సంప్ర దించుకుని, అన్ని ఎల క్ట్రానిక్ ఆధారాలను నాశనం చేయాలని నిర్ణయించుకున్నామని ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో పేర్కొ న్నారు. ఈమేరకు ఎస్ఐబీ టెక్నికల్ సిబ్బంది సాయంతో అన్ని సర్వర్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరిక రాల్లోని డేటా ధ్వంసం చేశామని తెలిపారు.
అత్యాధునిక సాంకేతికతతో సమాచారం…. ఇంటెలిజెన్స్, ఎస్ఐబీలో ఉన్న ప్రత్యేక టీంలు అత్యాధునిక సాంకేతికతతో సేక రించిన సమాచారాన్ని వాట్సాప్, శ్నాప్చాట్ అప్లికేషన్స్ ద్వారా షేర్ చేసుకునే వాళ్లమని రాధాకిష న్రా వు వెల్లడించారు. ఏవైనా విషయా లు తెలుసుకోవాలన్నా, సందేహాల గురించి మాట్లాడుకోవా లన్నా సిగ్న ల్ యాప్ వినియోగించినట్లు తెలి పారు. భుజంగరావు, ప్రణీత్రావు, తిరుపతన్న, ఇంటెలి జెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావులతో సిగ్నల్ యాప్తోనే మాట్లాడేవారని వెల్లడిం చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఫలితాల వెంటనే ఒకేసారి రాజీనామాలు….
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువ డిన తర్వాతి రోజు 2023 డిసెంబర్ 4న ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్రావు రాజీనామా చేశారని తాను కూడా ఆయనతో పాటు అదే రోజు రాజీ నామా చేశానని రాధాకిషన్ రావు తెలిపారు. ‘‘ప్రభుత్వ సిమ్కార్డును, ల్యాప్టాప్, డెస్క్టాప్, ఐప్యాడ్ను తిరిగి ఇచ్చేశాను. నా సొంత మొబై ల్ ఫోన్ను ఫార్మాట్ (డేటా చెరిపి వేత) చేశాను. ప్రభాకర్రావు, భుజంగరావు, తిరుపతన్న, ఇతర అధికారులతో చేసిన చాటింగ్లు, సంభాషణలు డిలీట్ చేయించాను’’ అని వివరించారు. పెద్దాయన (కేసీ ఆర్) రెండు సార్లు సిటీ టాస్క్ఫోర్స్ లో రీ అపాయింట్మెంట్ ఇచ్చి నందున తాను ఆయనకు రుణపడి ఉన్నానని కాబట్టి, ఈ కేసులో ఇంత కుమించి వివరాలు చెప్పలేనని తన వాంగ్మూలంలో రాధా కిషన్రావు పేర్కొనడం గమనార్హం.
నల్లగొండ(Nalgonda) ఎస్పీ రెమా రాజేశ్వరి, ఇన్స్పెక్టర్ గట్టుమల్లు తోపాటు, ఇతర అధికా రులను చార్టర్డ్ విమానంలో కేరళకు పంపారు. అయినా ప్లాన్ వర్కవుట్ కాలేదు. అంతలోనే న్యాయస్థానం ఈ కేసును సిట్ నుంచి బదిలీ చేసి సీబీఐకి అప్పగించింది. ఈ సమ యంలో అనుకున్న విధంగా పని జరగకపోవడంతో పెద్దాయన (కేసీఆర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని రాధాకిషన్ తన వాంగ్మూ లంలో పేర్కొన్నారు. ‘‘దేశాన్ని కుది పేసిన ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మేము కీలకంగా ఉన్నాము. మొయి నాబాద్ ఫామ్హౌస్లో 2022 అక్టోబర్ చివరి వారంలో ఈ సంఘటన జరిగింది. ఈ సమయం లో మునుగోడు ఉప ఎన్నిక జరుగు తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి బీజేపీ లో చేరారు. దుబ్బాక, హుజూరాబా ద్ ఉప ఎన్నికల్లో గెలిచి ఊపుమీద ఉన్న బీజేపీని మునుగోడులో ఓడిం చాలని కేసీఆర్ ఆ సీటును ప్రతిష్ఠా త్మకంగా తీసుకున్నారు. ఇదే సమ యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో బీజేపీకి చెందిన కొందరు టచ్లోకి వెళ్లారని, పార్టీ మారేందుకు ఆయ న్ను ప్రలోభాలకు గురిచేస్తున్నా రంటూ సీఎం కేసీఆర్ నుంచి సమాచారం వచ్చిందని ప్రభాకర్ రావు నాతో చెప్పారు.
బీజేపీని ఇరుకున పెట్టే అవకాశాన్ని వదులు కోవడం ఇష్టంలేని కేసీఆర్ ఎమ్మెల్యే తోపాటు బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయాలని సూచించారు. ఈ పనిని ప్రణీత్ రావుకు అప్పగిం చారు. వారి ఫోన్లు ట్యాప్ చేయడం తోపాటు కొన్ని ఆడియో క్లిప్లను సేకరించి పంపాడతడు. అవే ఆడి యో క్లిప్లను సీఎం కేసీఆర్కు ఇచ్చాము. తమకు అనుకూలంగా పనిచేయాలంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని సూచించిన సీఎం కేసీఆర్, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నాయకుల చుట్టూ ఉచ్చు బిగించాలని పథకం వేశారు. ఇందులో భాగంగానే వేర్వే రు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను తెర పైకి తెచ్చారు. కేసీఆర్ ఆదేశాలతో నే పైలెట్ రోహిత్ రెడ్డి మరో ముగ్గు రు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ నేతల తరఫున వచ్చిన నేతలతో సంప్రదింపులు జరిపారు. వీరి వ్యవ హారం రికార్డ్ చేసేందుకు టాస్క్ఫో ర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్సై శ్రీకాంత్ను ఢిల్లీ పంపి కెమెరాలను తెప్పించి, సమావేశానికి ఒకరోజు ముందు ఫామ్హౌస్లో బిగించారు’’ అని రాధాకిషన్ రావు వివరించారు.
బిఆర్ఎస్కు మళ్లీ అధికారం కోసమే.. 2023లో బీఆర్ఎస్(BRS) పార్టీని మూడోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావు ఆధ్వర్యం లో ఎస్ఐబీ, టాస్క్ఫోర్స్ టీమ్లు అహర్నిశలూ కృషి చేసినట్టు రాధా కిషన్రావు చెప్పారు. ఫోన్ ట్యాపిం గ్ ద్వారా సేకరించిన సమాచారంతో ప్రత్యర్థి పార్టీల నాయకులకు ఆర్థికం గా అండగా నిలిచిన వ్యాపారులను గుర్తించి వారిని ఆర్థికంగా దెబ్బతీసే వాళ్లమని వారికి డబ్బు ఎక్కడి నుం చి వస్తుందో తెలుసుకొని, దాన్ని అడ్డుకొని సీజ్ చేసేవాళ్లమని వివ రించారు. అలాగే బీఆర్ఎస్ గెలుపు ను అడ్డుకునేవారు, పార్టీ మనుగడ కు ఇబ్బందికరంగా మారిన కొంత మంది ప్రముఖులతో పాటు, పార్టీలోనే ఉన్నా అసంతృప్తితో రగిలిపోతున్న అనుమానితుల ఫోన్లూ ట్యాప్ చేసి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పెద్దాయనకు చేర వేశామని రాధాకిషన్రావు పోలీసు లకు వెల్లడించారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూ ర్ రాజుపైన, కడియం శ్రీహరితో విభేదాలున్న రాజయ్యపైనా తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారిపైనా.. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, సరిత తిరుప తయ్య, జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనా రాయణ ఫోన్లపై నిఘాపెట్టి ట్యాప్ చేశామని రాధాకిషన్రావు పేర్కొ న్నారు. బీజేపీ నేతలు ఈటల, బండి సంజయ్, ఎంపీ అరవింద్ అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని వారితో పాటు, ఎన్టీవీ, ఎబిఎన్ చైర్మన్ ల ఫోన్లు ట్యాప్ చేసినట్లు రాధాకిషన్రావు వాం గ్మూల మిచ్చారు. మాజీ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ప్రణీత్రావుతో డైరెక్ట్గా టచ్లోకి వెళ్లి ఐన్యూస్ ఎండీశ్రవణ్ కుమార్, ఎమ్మెల్సీ నవీన్ రావు అందించిన సమాచారంతో పలువురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆయన వెల్లడిం చారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునిల్ కనుగోలునూ ప్రణీత్రావు టార్గెట్ చేసి, కేసులు నమోదు చేశా రని రాధాకిషన్రావు పేర్కొన్నారు.
BRS ruling third time phone tapping