Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana formation day: అంగరంగవైభవం, అట్టహాసంగా పదేళ్ళ ఆవిర్భావ పండుగ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినో త్సవాన్ని పురస్కరించుకొని పదేళ్ల ఉత్సవాలు ఘనంగా, అంగ రంగ వైభవంగా నిర్వహించేందుకు రేవం త్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక ఏర్పాటు చేస్తుంది.

ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లలో రేవంత్ ప్రభుత్వం
రాజముద్రలో పెత్తనo ఆనవాళ్ళు గా కాకతీయ చార్మినార్, కళాతోర ణంపై నిర్ణయం
తొలిదశ ఉద్యమ స్మృతులకు వాటి స్థానంలో అవకాశంపోరాటపటిమ,వ్యవసాయం ప్రతి బింబించేలా రాజముద్ర రూపం
సర్వమతాలకు ప్రతీకగా ఒక గుర్తు గా రాష్ట్ర అధికారిక చిహ్నం
సీఎం తో చర్చల్లో పాల్గొన్న భట్టి, కోదండరాం, అందెశ్రీ, కీరవాణి తదితరుల బృందం
చిహ్నం, గీతంలో మార్పులు, చేర్పులు పై బిఆర్‌ఎస్‌ ఆగ్రహం

ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినో త్సవాన్ని(Telangana formation day) పురస్కరించుకొని పదేళ్ల ఉత్సవాలు ఘనంగా, అంగ రంగ వైభవంగా నిర్వహించేందుకు రేవం త్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక ఏర్పాటు చేస్తుంది. పదేళ్ల ఉత్స వాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమై ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర అధి కారిక చిహ్నం దాదాపు ఖరారైంది. రాష్ట్ర గీతం రూపకల్పన సైతం తుది రూపుదిద్దుతుంది. ఈ రెండు అంశాలపై బుధవారం ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సుదీర్ఘ కసరత్తు చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణా రావు, ప్రొఫెసర్‌ కోదండరామ్‌, రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్న రుద్ర రాజే శం తదితరులతో సమావేశమై చర్చించారు.

ప్రస్తుతం ఉన్న చిహ్నం లో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ కళా తోరణం,(Kakatiya Kala Toranam)చార్మినార్‌ గుర్తులను తొల గించారు. కాకతీయుల కాలం అన గానే తెలంగాణ ప్రజలకు సమ్మ క్క–సారలమ్మ దేవతలే గుర్తుకు వస్తారని, కాకతీయులతోనే సమ్మ క్క–సారలమ్మలు పోరాడారనే అభి ప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఇక చార్మినార్‌ అనగానే సామా న్యులను అణచివేసిన నవాబులు గుర్తుకువస్తారని, అందుకే రాష్ట్ర చిహ్నంలో ఈ రెండు గుర్తులను తొలగించాలని నిర్ణయించారు. అదే సమయంలో కొన్ని కొత్త అంశాలను చిహ్నంలో చేర్చనున్నారు. తెలం గాణ(Telangana) ప్రత్యేక రాష్ట్రం కోసం 1969 లో తొలిదశ ఉద్యమం జరిగిందని, నిజానికి తెలంగాణ అనే భావానికి తొలిదశ ఉద్యమమే బీజమని, కానీ ఆ ఉద్యమ స్ఫురణకు ఆనవాళ్లు ప్రస్తుత చిహ్నంలో కనిపించడం లేదని సమావేశంలో అభిప్రాయప డ్డారు.

అందుకే నాటి ఉద్యమ స్మృ తులను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉండాలని నిర్ణయించారు. అదే విధంగా సర్వమతాలకు చి హ్నంలో ప్రాధాన్యం కల్పించారు. తెలంగాణ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, ప్రజల జీవనాధారం పాడి పంటలు అయినందున చిహ్నంలో రైతాంగం ప్రతిబిం బించేలా కూడా ఉండాలనే అభి ప్రాయం వ్యక్తమైంది. దాంతో దీనిని కూడా చేర్చాలని నిర్ణయించారు. ఇక దేశానికి గర్వకారణమైన అశోక చక్రాన్ని యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు(MLA) యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, రాంచంద్రునాయక్‌, గండ్ర సత్యనారాయణ, శాసనమండలి సభ్యుడు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు బలరాం నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

రెండు ట్యూన్ లలో రాష్ట్ర గీత…

తెలంగాణ రాష్ట్ర గీతం రూపక ల్పనపైనా కవి అందెశ్రీ,(Andeshri) సంగీత దర్శకుడు కీరవాణి, రాష్ట్ర ఉపము ఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షిం చారు. ప్రతిరోజూ పాఠశాలల్లో విద్యార్థులు ప్రార్థనా గీతంగా, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రారంభ గీతంగా ఆలపించేందుకు అనువుగా 2.30 నిమిషాల నిడివి తో ఒక వెర్షన్‌, 13:30 నిమిషాల నిడివితో రూపొందించిన రెండో వెర్షన్‌ రికార్డును సంగీత దర్శకుడు కీరవాణి వినిపించారు. ఇంతకు ముందు సమావేశంలో సీఎం రేవం త్‌రెడ్డి సూచలనకు అనుగుణంగా రెండు వెర్షన్‌లలో చేసిన మార్పులు, చేర్పులతో గీతాన్ని రూపొందిం చారు. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతా న్ని జూన్‌ 2న నిర్వహించబోయే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆవిష్క రించనున్నారు.తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు, రాష్ట్ర గీతం ఆవిష్కరణపై రగడ మొదలైంది. అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

రాష్ట్ర చిహ్నంలో ప్రజల ఆలోచనలు, ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఆ మే రకు పలు మార్పులు చేస్తూ తాజా గా నిర్ణయం తీసుకున్నారు. అయి తే రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేసినా, తెలంగాణ గీతాన్ని ఆంధ్రకు చెందిన సంగీత దర్శకునితో స్వరక ల్పన చేయించినా సహించేదిలేదని బీఆర్‌ఎస్‌ నేతలు హెచ్చరిస్తున్నా రు. చిహ్నంలో కాకతీయ కళాతోర ణం గుర్తును తొలగించడాన్ని వ్యతి రేకిస్తూ బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌(B. Vinod Kumar)తదితరులు బుధవారం వరంగల్‌లో నిరసనకు దిగారు. ఓరుగల్లు పౌరుషమేంటో చూపిస్తామని హెచ్చరించారు. ఇక అందెశ్రీ రాసిన జయజయహే తెలం గాణ జననీ జయకేతనం గీతాన్ని తెలంగాణ వారితోనే స్వరకల్పన చేసి పాడించాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే బీఆర్‌ఎస్‌ విమర్శలపై కాంగ్రెస్‌(Congress) ఎదురుదాడి ప్రారంభిం చింది. 2004లో తొలిసారి ఈ పాటను గాయకుడు రామకృష్ణతో కేసీఆర్‌ రికార్డు చేయించారని, రామకృష్ణ ఆంధ్రాకు చెందిన వ్యక్తే కదా అని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్ని స్తున్నారు. అంతేకాకుండా యాదగి రిగుట్ట పునరుద్ధరణ పనులను ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయికి అప్పగిం చారని, ఆయన కూడా ఆంధ్రా ప్రాంతానికి చెందినవారే కదా సచివాలయ నిర్మాణ పనులను కూడా మధ్యప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టు కంపెనీకి అప్పగించారు కదా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా వేరే ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్‌తో చేయించారు కదా అని కాంగ్రెస్‌ నేతలు తిప్పికొడు తున్నారు. పాట రికార్డు అయ్యాక చివరలో ఈ రాద్ధాంతం చేయడ మేంటని ప్రశ్నిస్తున్నారు.

Telangana formation day celebratations