Yadadri theft case: ‘ యాదాద్రి ‘ చోరీ కేసు చేధన
నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్)లో విలు వైన సామాగ్రి చోరీ కేసును పోలీ సులు ఛేదించారు. యంత్ర పరిక రాలు, జీఐ బండిల్స్, అల్యూ మిని యం షీట్లు ఏడాదిన్నరగా చోరీ అవుతున్నాయి.
రూ.1.49కోట్ల సామగ్రి, నగదు
స్వాధీనం,11 మంది అరెస్టు
ఏడాదిగా సాగుతోన్న విలువైన పరికరాల చోరీ
దొంగిలించిన సామగ్రి హైదరాబాద్ లో అమ్మకం
ప్లాంట్ లో పనిచేసిన ఓ పోలీసు అధికారి పాత్రపై అనుమానం
ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(Yadadri Thermal Power Plant)(వైటీపీఎస్)లో విలు వైన సామాగ్రి చోరీ కేసును పోలీ సులు ఛేదించారు. యంత్ర పరిక రాలు, జీఐ బండిల్స్, అల్యూ మిని యం షీట్లు ఏడాదిన్నరగా చోరీ అవుతున్నాయి. వైటీపీఎస్(YTPS)లో చొర బడుతున్న దొంగలు, విలువైన వస్తువులను స్క్రాప్గా అమ్ముకొని కోట్లలో సొమ్ము చేసుకుంటున్నట్లు గా ఆరోపణలొచ్చిన విషయం తెలిసిందే. ఈ చోరీ కేసును నల్ల గొండ జిల్లా పోలీసులు ఛేదించారు. చోరీకి సంబంధించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో శుక్రవారం విలేక రుల సమావేశంలో జిల్లా ఎస్పీ చందన దీప్తి(SP Chandana Deepti)వివరాలను వెల్లడిం చారు. నిందితుల నుంచి రూ.71 లక్షల విలువైన నాలుగు జీఐ బండిల్స్ను, రూ.58లక్షల నగదు ను, రూ.20లక్షల విలువైన ఓ బెలినో కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను మొత్తం రూ.1.49 కోట్ల విలువైన వస్తువు లను, నగదును స్వాధీనం చేసు కున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వం చేపట్టిన వైటీపీఎస్ ప్రాజెక్టులో భారీ నిర్మాణాలు జరుగుతుండగా, అందుకు అవసరమైన పరికరాలను ఆ ప్రాజెక్టు ప్రాంతంలో నిల్వ ఉంచారు. ఏడాదిన్నర కాలంగా ఈ పరికరాలు భారీ ఎత్తున చోరీకి గురికావడం గమనించిన నిర్మాణ కంపెనీ బీహెచ్ఈఎల్, ఇతర నిర్మాణ సంస్థలు వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు మూడు కేసులను నమోదు చేసి పోలీసులు విచారణ చేప ట్టారు. తమ ఆదేశాల మేరకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు(DSP Rajasekhar Raju)ఆధ్వర్యంలో మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు, వాడపల్లి ఎస్ఐ రవి, వేములపల్లి ఎస్ఐ విజయ్కుమార్, మాడ్గులపల్లి ఎఎస్సై శోభన్బాబు, వాడపల్లి పీఎస్ సిబ్బంది, సీసీఎస్ కానిస్టే బుల్ విష్ణులతో కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పడి వారం రోజులుగా చేసిన విచారణతో మూడు కేసుల ను నమోదు చేశామని, మిర్యాల గూడకు చెందిన షేక్ మహ్మద్, షేక్ మునీర్, షేక్ రజాక్, మహ్మద్ జానీ, మంద మహేశ్, దామరచర్ల మండ లం ఇరికిగూడెంకు చెందిన కంబాల అశోక్, అదే మండలం వీర్లపాలెంకు చెందిన మంద శ్రీను, వాడపల్లికి చెందిన మహ్మద్ అఫ్రోజ్, వీర్లపా లెంకు చెందిన మంద నాగేందర్బా బు, యూపీకి చెందిన అమిత్కు మార్ భరద్వాజు, రవీంద్ర ప్రసాద్ అనే వ్యక్తులను అరెస్టు చేశామని వెల్లడించారు.
వీరు వైటీపీఎస్ ఆవరణలోకి డీసీఎంలను పంపి క్రేన్ ఆపరేటర్ సహకారంతో చోరీ చేసిన పరికరాలను హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన షరీఫు ద్దీన్కు(Sharifuddin)విక్రయించి సొమ్ము చేసుకుని పంచుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుందని నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి పోలీస్ కస్టడీ ద్వారా మిగతా విచారణ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇంకా ఎవరెవరు భాగస్వాములు ఉన్నారో విచారణ చేయాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా చోరీ ముఠాకు గతంలో పవర్ప్లాంట్లో విధులు నిర్వ హించిన ఓ పోలీస్(Police) అధికారి అండ దండలు అందించినట్లు చర్చ సాగుతోంది. అందుకు ప్రతిఫలంగా దొంగల నుంచి లక్షల్లో తీసుకున్నట్లు సమాచారం. సెక్యూరీటీ ఎస్సైగా విధులు నిర్వహించి సీఐగా పదో న్నతిపై బదిలీ అయిన అధికారి. తాను విధుల్లో ఉన్నప్పుడే విలువైన యంత్రపరికరాలను ముఠా సభ్యు లు తరలించారని పలువురు ఆరోపి స్తున్నారు. బరువైన యంత్రాలను సైతం హైడ్రాలిక్ క్రేన్లతో అద్దె వాహనాల్లోకి లోడ్ చేసి ప్రధాన గేటు ద్వారానే తరలించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Police caught thiefs