Congress MP candidate : గుజరాత్ మోడల్ లో ఎగ్జిట్ పోల్స్
--ఎగ్జిట్ పోల్స్ కూడా షేర్ మార్కెట్ ను తలపిస్తున్నాయి --దేశంలో షేర్ మార్కెట్ బ్రోకర్లంతా గుజరాత్ లోనే --భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి
గుజరాత్ మోడల్ లో ఎగ్జిట్ పోల్స్
–ఎగ్జిట్ పోల్స్ కూడా షేర్ మార్కెట్ ను తలపిస్తున్నాయి
–దేశంలో షేర్ మార్కెట్ బ్రోకర్లంతా గుజరాత్ లోనే
–భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి
ప్రజా దీవెన, భువనగిరి: లోక్ సభ ఎన్నికల ఫలితాలకు సంబంధిం చి ఇటీవల వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్ని గుజరాత్ లో ( gujar ath) వెలువడినవే అని భువనగిరి ఎంపి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ( chamala Kiran Ku mar Reddy) అన్నారు. ఆయా మీడియా ప్రై వేట్ సంస్థలు వెలు వరించిన ఎగ్జిట్ పోల్స్ కూడా షేర్ మార్కెట్ ను తలపి స్తున్నాయని ఎద్దేవా చేశారు.
దేశంలో షేర్ మార్కెట్ బ్రోకర్లంతా గుజరాత్ లోనే ఉంటారని ద్వజమె త్తారు. సోమవారం భువనగిరి (bhuvanagiri) నియోజకవర్గ కేం ద్రంలో ఏర్పాటు చే సిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా డారు. తెలంగాణలోనే అన్ని పార్లమెంట్ స్థానాల్లోకెల్లా అత్యధికంగా 77% పోలింగ్ శాతం నమోదు చేసినందు కు భువనగిరి పార్లమెంట్ నియోజ కవర్గం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
దేశవ్యాప్తంగా మోదీ మీడియా ప్రకటిస్తున్న ఎగ్జిట్ పోల్స్ గుజరాత్ షేర్ మార్కె ట్ ను తలపిస్తున్నాయని తీవ్ర స్థాయిలో విరుచుకుప డ్డారు. పలు సంవత్సరాలుగా దేశ ప్రజల విశ్వాసం కోరుకున్న ఇండి యాటుడే లాంటి సంస్థలు కూడా ప్రజల్లో కల్పించే విధంగా ఎగ్జిట్ పో ల్స్ ప్రకటించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
లోక్ సభకు తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ (kcr) తన కూతురు ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం బిజెపి తో కుమ్ముక్కయ్యారని ఆరోపించాడు.ప్రజల్లో అనుమానం రాకుండా బిజెపికి ( bjp) పరోక్షంగా మద్దతు ప్రకటించేందుకు తెలం గాణలో పలు పార్ల మెంట్ నియోజకవర్గంలో బలహీన అభ్యర్థులను ప్రకటించారని లో పాయి కారి ఒప్పందంతో సైలెన్ట్ గా భారతీయ జన తా పార్టీ అభ్య ర్థికి తమ ఓట్లు బదలాయించారని ఆరోపించారు.
పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల సమయం లో కూడా కాంగ్రెస్ అ భ్యర్థిని దెబ్బ తీసేందుకు బిజెపి పరోక్షంగా బిఆర్ ఎస్ అభ్యర్థికి మద్ద తు పలికిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( revanth reddy ) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం పలికినా కూడా 25 పేజీల ఉత్త రాన్ని రాసి పంపడం ఆయన బలహీనతలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.
భువనగిరి పార్లమెంటు సీటు పై ఎగ్జిట్ పోల్స్ వాస్తవాలు కావని ఖం డించారు.ప్రజల సంపూర్ణ ఆశీర్వాదం నాకే ఉన్నoదున భువనగిరి ఎంపీగా నే ను విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నేతలు తామే గెలుస్తామని ఎగ్జిట్ పోల్స్ ( eg jit polls) పేరుతో తప్పుదోవ పట్డిస్తున్నారన్నారు.
గుజరాత్ మోడల్ స్టాక్ మార్కెట్ పెంచేందుకు వ్యాపార ధోరణితో కొందరు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్లు తెలుస్తోందని, వాస్తవాలు రేపటి ఫలితాలతో తెలుస్తాయని పేర్కొన్నారు. వాస్తవానికి భువనగిరి పార్ల మెంటు నియోజక వర్గంలో బిజెపికి నాయకత్వం లేదని, ఓటు బ్యాం కు అసలే లేదని, నాటి నుంచి నేటి వరకు జరిగిన ఎన్నికల్లో కూడా పెద్దగా బిజెపి కి ఓట్లు లభించలేదని గుర్తు చేశారు.
తెలంగాణ లో భువనగిరి ఎంపీతో పాటుగా పది, పన్నెండు ఎంపి స్థా నాలు కాంగ్రెస్ గెలుస్తుందనేది నూ టికి నూరుపాళ్లు నిజమవుతుo దని స్పష్టం చేశారు.భువనగిరి ప్రాంత ఓటర్లు విప్లవ స్ఫూర్తి కలిగిన ఓటర్లని వారు విలక్షణమైన తీర్పును ఇవ్వ బోతున్నారని, ఏది ఏమై నా 10 శాతం ఓట్ల తేడాతో తాను విజయం సాధించబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు.
యువ నాయకుడిని పార్ల మెంట్ ఎన్నికలలో విజయం సాధించి భు వనగిరి పార్లమెంటు నియోజ కవర్గాన్ని దేశంలోనే మోడల్ నియో జకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో భువ నగిరి మున్సిపల్ చైర్మన్ పోతoశెట్టి వెంకటేశ్వర్లు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి పొత్న ప్రమోద్ కుమార్. అత్తహర్ బాలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.