Parliament election vote counting:అందరి చూపు అంతిమ తీర్పు పైనే…!
లోక్ సభ ఎన్నికల ఫలితాల తీర్పు వెలువడే సమయం ఆసన్నమైంది. దేశం యావత్తుతో పాటు ప్రపంచం లో కూడా అందరూ భారత దేశ ఎన్నికల ఫలితాల అంతిమ తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తు న్నా రు.
నేడే లోక్ సభ ఏపి అసెంబ్లీ ఎన్నిక ల ఓట్ల లెక్కింపు
తొలి అరగంటలోనే పోస్టల్ బ్యాలె ట్లు, తర్వాత ఈవీఎంలు
ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4కల్లా పూర్తి ఫలితాలు
రాష్ట్రవ్యాప్తంగా 34 చోట్ల కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు
21 రోజుల ఉత్కంఠ తర్వాత ప్ర ధాన పార్టీల భవిష్యత్ ను తేల్చ నున్న రోజు
ప్రజా దీవెన, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ఫలితాల(Lok Sabha election results)తీర్పు వెలువడే సమయం ఆసన్నమైంది. దేశం యావత్తుతో పాటు ప్రపంచం లో కూడా అందరూ భారత దేశ ఎన్నికల ఫలితాల అంతిమ తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తు న్నా రు. ఎట్టకేలకు 21 రోజుల ఉత్కంఠ తర్వాత ప్రధాన పార్టీల భవిష్యత్ ను తేల్చనున్న రోజు రానే వచ్చిం ది.మంగళవారం లోక్ సభ ఎన్ని కలు, ఏపి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమై సాయం త్రం వరకల్లా తీర్పు వెలువడనుంది. కేంద్రం ప్రభుత్వంలో తిరిగి బిజెపి(BJP) పాగా వేసి పక్కా మూడోసారీ మోదీ చరిత్ర సృష్టించనున్నారా, రాహుల్ కు అదృష్టం కలసి రానుందా, ఏ కూటమిదో గెలుపు అనే ఉత్కంఠ కు నేటితో తెరపడనుంది. ప్రధానం గా ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి, వైసీపీలో(YCP) ఎవరు పై చేయి సాధిస్తా రన్న సర్వత్రా నెలకొంది.
ఈ క్రమం లో 81 రోజుల ఎన్నికల ప్రక్రియలో 46 రోజుల ప్రధాన క్రతువుకు తెర దించుతూ 21 రోజుల నిరీక్షణకు టాటా చెప్పనున్నారు.దేశవ్యాప్తంగా ప్రజల అంతిమ తీర్పు కు సమయం ఆసన్నమైంది. తెలంగాణ లో ప్రధాని మోదీ,(Prime Minister Modi) కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఇంకోవైపు పలుసార్లు సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో రాష్ట్రంలో లోక్సభ ఎన్ని కలు ప్రతిష్ఠాత్మకంగా జరిగాయనే చెప్పాలి. ఈ క్రమంలో ఫలితాలు అన్ని ప్రధాన పార్టీలకు ఎంతో కీల కం కానున్నాయి. వీటిని బట్టి భవి ష్యత్ పరిణామాలుంటాయని విశ్లే షకులు చెబుతున్నారు. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కచ్చితంగా రెండంకెల సంఖ్యలో సీట్లు సాధిస్తామని అధికార కాంగ్రెస్(Congress) ఎంతో ధీమాగా ఉంది. ఫలితాలు తమ వంద రోజుల పాలనకు రెఫ రెండమని సీఎం రేవంత్ రెడ్డి ఇప్ప టికే ప్రకటించారు. ప్రధాని మోదీ కరిష్మానే నమ్ముకున్న బీజేపీ పదికి పైగా సీట్లు సాధిస్తామన్న ఆత్మవి శ్వాసం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో డీలాపడిన బీఆర్ఎస్ సైతం మెరుగైన సంఖ్య లో స్థానాలు సాధిస్తామని గట్టిగా చెబుతోంది.
ఏదిఏమైనా అంతిమ ఘడియలు సమీపించిన సందర్భంలో రాజకీయ పార్టీలు, రెండు రాష్ట్రాల ప్రజలు సైతం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే సమయo ఆసన్నమైంది. సుదీర్ఘంగా సాగిన అంకానికి శుభం కార్డు పడనుంది. ఓటర్ల మనుసు గెలుచుకున్నదెవరో మరికొద్ది గంట ల్లో తేలిపోనుంది. మంగళవారం లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువ డనున్నాయి. మే 13న రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్లో ప్రజల తీర్పేమి టో స్పష్టం కానుంది. ఈ మేరకు ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. అన్ని లోక్సభ నియోజ కవర్గ కేంద్రాల్లో కౌంటింగ్ సెంటర్లు(Counting Centres)నెలకొల్పింది. ఓటర్ల సంఖ్య, ఈవీ ఎం యూనిట్ల ఆధారంగా హైదరా బాద్లోనే ఏడు చోట్ల లెక్కింపు జరగనుంది. సికింద్రాబాద్కు సంబం ధించి ఆరుచోట్ల, ఆదిలాబాద్, మల్కాజిగిరిలకు మూడు చోట్ల, మెదక్, పెద్దపల్లి నియోజకవర్గాలకు రెండేసి చోట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం, మహ బూబాబాద్, వరంగల్, భువనగిరి, నల్లగొండ, నాగర్కర్నూల్, మహ బూబ్నగర్, నిజామాబాద్, చేవెళ్ల, జహీరాబాద్, కరీంనగర్లకు ఒక్కో చోట కౌంటింగ్ జరగనుంది.
పోస్టల్ బ్యాలెట్ల కోసం 19 హాళ్లు, ఈవీ ఎంల ఓట్ల లెక్కింపునకు 119 అసెం బ్లీ నియోజకవర్గాలకు ఒక్కొక్కటి చొప్పున, చేవెళ్ల పార్లమెంటు స్థానం లోని మహేశ్వరంలో రెండు హాళ్లు 120 కలుపుకొని మొత్తం 139 హాళ్లు, 1,855 టేబుళ్లను సిద్ధం చేశారు. భద్రతా బలగాల పహా రాలో లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలుకానుంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్తో కలిపి 66.3 శాతం పోలింగ్ నమోదైంది. 3,32,16,348 మంది ఓటర్లకు గాను 2,20,24,806 మంది ఈవీ ఎంల ద్వారా, 2,10,771 మంది పోస్టల్ బ్యాలెట్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవ ర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునూ మంగళవారమే చేపట్టనున్నారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం మొదలు కానుంది.
మొట్ట మొదటి ఫలితం 9.30 గంటలకు… ఉదయం 8 గంట లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొద లుకానుంది. తొలి అరగంటలో పోస్ట ల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉంటుంది. తర్వాత ఈవీఎంలు తెరుస్తారు. మొదటి రౌండ్ ఫలితం వెలువడేం దుకు గంటరన్నర సమయం పట్ట నుంది. ఈవీఎంలను టేబుళ్లపైకి చేర్చడం, లెక్కించడం, సరిపోల్చు కోవడం, రిటర్నింగ్ అధికారి నిర్ధారిం చుకుని ప్రకటించడం వంటి ప్రక్రియ లే దీనికి కారణం. ఈ నేపథ్యంలో తొలి రౌండ్ ఫలితం 9.30 వరకు వెలువడనుంది. అనంతరం ఒక్కో రౌండ్కు 20 నిమిషాల సమయం పట్టే అవకాశముంది. సాయంత్రం 4 గంటల్లోపు పూర్తి ఫలితాలు వస్తా యని ఎన్నికల అధికారులు చెబు తున్నారు. అయితే తెలంగాణ(Telangana) లోక్సభ ఎన్నికల్లో మొదటి ఫలితం మధ్యాహ్నం ఒంటి గంటకు వెలువ డనుంది. 15 రౌండ్లలో లెక్కింపు పూర్తయ్యే నిజామాబాద్ నియోజక వర్గం విజేత ఎవరో తొలుత తేల నుంది. 24 రౌండ్ల వంతున లెక్కింపు జరిగే కరీంనగర్, నల్లగొండ, హైదరా బాద్ ఫలితాలు ఆఖరున రాను న్నాయి. చాలా లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపు 18 నుంచి 21 రౌండ్ల లో పూర్తికానుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేసి, వీవీప్యాట్ స్లిప్పులను(VVPAT slips) లెక్కిస్తారు. వీటిని, ఈవీఎంలలోని ఓట్లతో సరిపో ల్చుకుంటారు. ప్రతి రౌండ్ ఫలితా నికి సంబంధించి రాజకీయ పార్టీల ఏజెంట్లు ఫామ్ ‘17సీ’పై సంతకం చేయాల్సి ఉంటుంది. అనంతరం రిటర్నింగ్ అధికారి సంతకం చేస్తా రు. తర్వాత కేంద్ర ఎన్నికల పరిశీల కుడు ఫలితాన్ని ప్రకటిస్తారు.
Parliament election vote counting