High Tension: ప్రభుత్వ,ప్రైవేటు ఆస్తులు ధ్వంసo
తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలు పొంది అధికారం చేపట్టకముందే టీడీపీ దాడులు చేస్తోందని గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని వైసీ పీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
మా నేతలు, కార్యకర్తలపై బౌతిక దాడులు పెరిగాయి
గ్రామాల నుంచి మా వాళ్లను తరి మి వేస్తున్నారు
శాంతి భద్రతలు పూర్తిగా విఫలమ య్యాయి
జోక్యం చేసుకోమంటూ గవర్నర్ కు జగన్ అభ్యర్ధన
ప్రజా దీవెన, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలు పొంది అధికారం చేపట్టకముందే టీడీపీ దాడులు చేస్తోందని గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని వైసీ పీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడు లతో అత్యంత భయానక వాతా వరణం నెలకొందని జగన్(Jagan) తన ట్వీట్లో పేర్కొన్నారు. సచివాల యాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తు న్నారని, వైసీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్ల కు పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మా రిందని, ఐదేళ్లుగా పటిష్ఠంగా ఉన్న శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, గవర్నర్(Governor)వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని కోరారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తు లకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ(TDP) దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని జగన్ ట్వీట్ చేశారు.
TDP workers attack on YSRCP workers in AP