Graduate Mlc counting : ముమ్మరంగా కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఎలిమినేషన్
--ప్రస్తుతానికి 35 మంది అభ్యర్థుల ఎలిమినేషన్
ముమ్మరంగా కొనసాగుతోన్న
ఎమ్మెల్సీ ఎలిమినేషన్
–ప్రస్తుతానికి 35 మంది అభ్యర్థుల ఎలిమినేషన్
ప్రజా దీవెన, నల్లగొండ: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ (mlc) ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలిమి నేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గడిచిన రెండు రోజులు గా కొనసాగుతున్న ఎన్నికల లెక్కింపు (votes counting) ప్రక్రి యలో మూడో రోజైన శుక్ర వారం మధ్యా హ్నం వరకు పోటీలో ఉన్న 33, 34, 35 అభ్యర్థుల ఎలిమినేషన్ పూర్తయింది.
ఇప్పటి వరకు జరిగిన ఎలి మినేషన్ కార్యక్రమoలో బి ఆర్ ఎస్ కు స్వల్పంగా రెండో ప్రాధాన్యత ఓటు పెరిగి 59 ఓట్లు లభించగా ఇప్పటి వరకు ఆధిక్యత కొనసా గిస్తున్న కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు 12 ఓట్లు మాత్ర మే వచ్చాయి. కాగా ప్రస్తుతం కాంగ్రెస్ ( congress) అభ్యర్ధి తీన్మార్ మల్లన్న 18,708 ఓట్ల మెజార్టీతో ముందుకు సాగుతున్నాడు.
ఆయితే ఎమ్మెల్సీ ఎన్ని కల్లో గెలుపుకు కావాల్సిన కోటా కోట ఓట్లు 1,55,095 ఉన్నాయి. ఈ క్రమంలో ఆధిక్యతలో ఉన్న తీన్మార్ మల్ల న్న గెలుపుకు కావాల్సిన ఓట్లు 31,814 కాగా బిఆర్ఎస్ (brs) అ భ్యర్ధి రాకేష్ రెడ్డి గెలుపుకు 50,522 ఓట్లు కావాల్సి ఉంటుందని అధికారు లు వెల్లడించారు.
అదే సందర్భంలో బిజేపి (bjp) అభ్యర్థి ప్రేమేoధర్ రెడ్డికి వచ్చిన మొదటి ప్రాదాన్యత ఓట్లు 43,313 కాగా ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్ల లో వచ్చే ఫలితాల మేరకు విజేత ఎవరనేది తేల నుంది. ఇదిలా వుండగా మూడు హాల్స్ లో ప్రత్యేక టేబుల్ల లో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా సాయంత్రం 6 గంటల లోపు తుది ఫలితం వెలువడనుందని అధికారిక వర్గాలు పేర్కొన్నా యి.