Indians drowned: భారతీయ విద్యార్థుల జల సమాధి
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో నదిలో అయిదుగురు భారతీయ విద్యార్థులు మునిగిపో యారు. స్థానికులు అందులో ఒకరిని రక్షించారు.
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో నదిలో ఘటన
నదిలో మునిగిన ఐదుగురిలో నలుగురు మృతి, ఒకరు సేఫ్
ప్రజా దీవెన,రష్యా: రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్(Saint Petersburg) సమీపంలో నదిలో అయిదుగురు భారతీయ విద్యార్థులు మునిగిపో యారు. స్థానికులు అందులో ఒకరిని రక్షించారు. నలుగురు పూర్తిగా నీటిలో ముగిని మృతి చెందారు. మరణించిన నలుగురిలో 18-20 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకులు కాగా,మరో ఇద్దరు యువతులు. వారంతా వెలికి నొవ్గోరోడ్ నగరంలోని సమీపంలోని నొవ్గోరోడ్ స్టేట్ యూనివర్శిటీలో(Novgorod State University) చదువుతున్నారు. కాగా, వోల్ఖోవ్ నది ఒడ్డున నిలబడిన ఉన్న ఓ భారతీయ విద్యార్థిని నీటిలో మునిగింది. ఆమెను రక్షిం చేందుకు నలుగురు సహచరులు ప్రయత్నించారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆ విద్యార్థినితో పాటు మరో ముగ్గురు కూడా నదిలో మునిగిపోయారు.
ఓ బాలుడిని స్థానికు లు సురక్షితంగా బయటకు తీసుకొ చ్చారు. “సరైన వైద్యం అందిస్తున్నా రు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అని సెయింట్ పీటర్స్బర్గ్లోని ఇండియన్ మిషన్(Indian Mission) “ఎక్స్”లో రాసింది. వీలైనంత త్వరగా మృత దేహాలను బంధువులకు పంపడానికి వెలికి నొవ్గోరోడ్ స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు కాన్సులేట్ జనరల్ తెలిపారు. మృతుల కుటుంబాలను సంప్రదించి, అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తాము రష్యాలోని(Russia) భారత రాయబార కార్యాలయాన్ని, సెయింట్ పీటర్స్బర్గ్లోని కాన్సులర్ జనరల్ను సంప్రదించామని జలగా వ్ జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ ఓ మీడియా సంస్థకు తెలిపారు.
Indians drowned river St. Petersburg Russia