Repo rate: యధాతధంగా రెపో రేట్
దేశం లో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్ బిఐ
ఎనిమిదోసారి రెపో రేటును 6.5 శాతంగా అమలు
వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ –ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశం లో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్(Reserve Bank of India Governor Shaktikanta Das) ప్రకటించారు. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ముగింపు నేపథ్యం లో వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేశారు. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఈసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఆరుగురులో నలుగురు ఓటు వేశారని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ఫలితంగా వరుసగా 8వసారి రెపో రేటును 6.5 శాతంగా ఉంచింది ఆర్బీఐ. 2023 ఏప్రిల్ నుంచి రెపో రేటును ఆర్బీఐ యథాతథంగా కొనసాగిస్తూ రావడం గమనార్హం.
రేపు రేటు అంటే ఏంటో తెలుసా.. రిజర్వ్ బ్యాంక్ దేశంలోని బ్యాంక్లకు డబ్బులను అప్పుగా ఇవ్వడం ఆనవాయితీ.ఆ అప్పుపై వడ్డీని వసూలు చేస్తుం ది. దానినే రెపో రేట్ అంటారు. రెపో రేట్ పెరిగితే అధిక వడ్డీ చెల్లించా ల్సి వస్తుంది కాబట్టి బ్యాంక్లకు కష్టమవుతుంది. అందుకే బ్యాంక్లు కూడా వివిధ లోన్లపై వడ్డీని పెంచు తాయి. ఇది కస్టమర్లను(Customers) ప్రభావితం చేస్తుంది. రెపో రేటు తగ్గితే ఆర్బీఐకి బ్యాంక్లు ఇచ్చే వడ్డీ కూడా తగ్గు తుంది. తద్వారా ప్రజలకు బ్యాంకు లు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు దిగొ స్తాయి. ఇక రెపో రెట్లు మారకపోవ డంతో ప్రస్తుతం దేశంలో ఉన్న వివిధ లోన్లపై వడ్డీ రేట్లు కూడా పెద్దగా మారే అవకాశం లేదు.
ఆర్బీఐ మానటరీ పాలసీ నిర్ణ యాలు…
ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య మంచి సమతుల్యత కొనసాగుతోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని(Inflation) 4 శాతం వద్ద ఉంచడానికి ఆర్బీఐ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అయితే ఆహా ర ద్రవ్యోల్బణం పెరుగుతుం డడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నైరుతి రుతుపవనాలు ఖరీఫ్ సీజ న్ లో పంటల ఉత్పత్తిని పెంచు తాయని ఆశిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే దీని వల్ల రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరుగుతాయని భావి స్తున్నట్లు ఆషాభావం వ్యక్తం చేశారు. రిటైల్ ద్రవ్యోల్బణం 2024- 25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 4.9 శాతం, రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.6 శాతం, నాల్గో త్రైమాసికంలో 4.5 శాతం ఉండొచ్చ ని ఆర్బీఐ అంచనా వేసింది. అను కున్నట్లుగా సకాలంలో మంచి వర్షా లు పడితే, ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉండవచ్చు. ఒకవేళ ఇలా జరగక పోతే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నా రు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం లో కొంత మేరకు దిద్దుబాటు జరగ వచ్చని శక్తికాంత దాస్ అన్నారు.
ప్రపంచ రెమిటెన్స్ల్లో 15.2 శాతం వాటాతో ఇండియా అతిపెద్ద రిసీ వింగ్ (స్వీకరించే) దేశంగా కొనసా గుతోందని శక్తికాంత దాస్ తెలి పారు.ఇండియన్ రూపాయి సాపేక్ష స్థిరత్వంతో కొనసాగుతోంది. ఇది మన దేశ బలమైన, స్థితిస్థాపక ఆర్థిక మూలాలకు నిదర్శనంగా ఉందని శక్తికాంత దాస్ పేర్కొ న్నారు.వినియోగదారుల రక్షణకే ఆర్బీఐ ప్రథమ ప్రాధాన్యత ఇస్తుం దని, అయితే కొన్ని సంస్థలు ఇప్ప టికీ సరైన పారదర్శక విధానాలు పాటించకుండా కొన్ని రకాల రుసు ములు వసూలు చేస్తున్నాయి. వీటి పై ప్రత్యేక దృష్టి సారిస్తాం. అలాగే అసురక్షిత రుణాలు, అడ్వాన్స్లను ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం” అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు
ఎఫ్వై 2024 వార్షిక ఆర్థిక ఫలితా లు మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థ(Banking system) పటిష్టంగా, స్థితిస్థాపకంగా ఉన్నా యని సూచిస్తున్నాయని ఆర్బీఐ పేర్కొంది. 2024 ఆర్థిక సంవత్సరా నికి సంబంధించి అత్యవసర రిస్క్ బఫర్ (నిల్వలను) 0.5 శాతం పెంచడం వల్ల ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ మరింత మెరుగుపడుతుందని శక్తికాంత దాస్ అన్నారు. 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమా సికం నాటికి కరెంట్ ఖాతా లోటును మోడరేట్ అవుతుందని ఆర్బీఐ గవ ర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
2024 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బలంగా ఉన్న ప్పటికీ, నికర విదేశీ పెట్టుబడులు కాస్త మితంగానే ఉన్నాయి. ఊపం దుకున్న స్టాక్ మార్కెట్ల వడ్డీ(Stock markets interest) రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్బీఐ పెంచడంతో స్టాక్ మార్కెట్లకు జోష్ లభించింది. శక్తికాంత దాస్ ప్రకటన తో శుక్రవారం ట్రేడింగ్ సెషన్ లో దేశీయ సూచీలు లాభాల్లో కొన సాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 728 పాయింట్లు పెరిగి 75,802 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 225 పాయింట్ల లాభంతో 23,046 వద్ద కొనసాగుతోంది.
RBI keeps repo rate unchanged