MLA Pawan Kalyan: అనకాపల్లి నూకాలమ్మను దర్శించుకున్న పవన్
జనసేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ సోమవారం అనకా పల్లి నూకాలమ్మను దర్శించుకు న్నారు.
ప్రజా దీవెన, విశాఖపట్నం: జనసేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్(Pithapuram MLA Pawan Kalyan) సోమవారం అనకా పల్లి నూకాలమ్మను(Anakapalli Nukalamma) దర్శించుకు న్నారు. కూటమి పార్టీ విజయం సాధించాక తొలుత తాను నూకాం బికను దర్శించుకున్నాకే పిఠాపు రంలో అడుగు పెడతానని ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పట్లో పవన్ పేర్కొన్నారు. అనుకున్నట్టుగానే ప్రత్యేక విమానంలో పవన్ విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకుని అనంతరం ఆయన అనకాపల్లి (Anakapalli )వెళ్లారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యు లు, అర్చకులు ఆయనకు పూర్ణకుం భంతో స్వాగతం పలికారు. అనంత రం ప్రత్యేక పూజలు జరిపించి, పవన్ కల్యాణ్కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పవన్కు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు ఘనంగా స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే తిరుగు ప్రయాణంలో విశాఖలోనూ పవన్ కల్యాణ్కు కూటమి నేతలు సాదరంగా స్వాగ తం పలికారు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండానే పవన్ టూర్ సాగింది. పార్టీ నేతల్నీ తనతో రావద్దని ఆయన కోరారు. కార్యక్ర మంలో బత్తుల తాతయ్యబాబు, ప్రగడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Pithapuram MLA Pawan Kalyan visited Anakapalli Nukalamma