Crop loan: పంట రుణమాఫీకి విధివిధానాలు
రుణ మాఫీకి సంబంధించి విధి విధా నా లు రూపొందించాలని ముఖ్య మం త్రి రేవంత్ రెడ్డి అధి కారులకు సూ చించారు.
సత్వరమే మార్గదర్శకాలు రూపొం దించడి
ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే
పూర్తి డేటా సేకరించి, ప్రణాళిక సిద్ధం చేయండి
అధికారులతో సమీక్షలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: రుణ మాఫీకి(Crop loan waiver ) సంబంధించి విధి విధా నా లు రూపొందించాలని ముఖ్య మం త్రి రేవంత్ రెడ్డి అధి కారులకు సూ చించారు. పంట రుణ మాఫీ,ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth reddy) సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎన్ని కల సమ యంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధి కారులను ఆదే శించారు. రూ.2లక్ష ల వరకు రుణా లు(Farmer loan) ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హు లను గుర్తించాలని తెలిపారు.
కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవా లని సీఎం అధికారులకు సూచిం చారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరా లను అందుబాటులో ఉండేలా చూ డాలని తెలిపారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసేందుకుపూర్తి స్థాయి వివరాలతో పాటు అవసర మైన అంచనా వ్యయాన్ని రూపొందిం చాలని అధికారులకు సూచించా రు.
రుణమాఫీకి సంబంధించి విధి విధానాలను రూపొందించి స్పష్ట మైన ప్రణాళికతో ముందుకు రావా లని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగ స్టు 15లోగా పంట రుణమాఫీ చేసి తీరాలని ముఖ్య మంత్రి అధికారు లకు తేల్చిచెప్పా రు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ముఖ్య మంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖా అధికారులు పాల్గొన్నారు.
CM Revanth reddy review on Crop loan waiver