Power Purchase: విద్యుత్ కొనుగోళ్లపై విచారణ
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం పై నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత, మాజీ అధికారులను జస్టి స్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ గత కొద్ది రోజులుగా విచారిస్తోంది.
బిఆర్ కె భవన్ లో సాగుతోన్న జస్టిస్ ఎల్.నరసిం హారెడ్డి కమిషన్ విచారణ
ప్రజాదీవెన, హైదరాబాద్: యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల(Yadadri and Bhadradri Thermal Power Stations) నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం(Chhattisgarh Power Purchase Agreement) పై నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత, మాజీ అధికారులను జస్టి స్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ గత కొద్ది రోజులుగా విచారిస్తోంది. అందులో భాగంగా సోమవారం బీఆర్ కె భవన్లో ఉన్న తమ కార్యాలయంలో ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, మాజీ ట్రాన్స్కో- జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు లను పలు అంశాలపై కమిషన్ విచారించింది. సుమారు గంటన్నర పాటు పలు అంశాలపై వివరాలు అడిగి తెలుసు కున్నట్లు సమాచారం. ఈ వ్యవ హారాల్లో భాగస్వాములైన వ్యక్తు లు, సంస్థల నుంచి అభిప్రా యాలను సేకరించేందుకు కమిషన్ బహిరంగ ఇటీవలే ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. తొలి దశలో ప్రస్తుత, మాజీ ఉన్నతాధి కారులకు మాత్రమే నోటీసులు జారీ చేయడంతో పాటు విచారణ చేయ నున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఎన్నికల హడావుడి ముగిసి నందున విద్యుత్ కొనుగోళ్ల వ్యవ హారంపై విచారణ ముమ్మ రంగా కొనసాగనుంది.
Inquiry on Power Purchases