Tescob Chairman: టెస్కాబ్ చైర్మన్గా మార్నేని రవీందర్రావు
తెలం గాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాం కు(టెస్కాబ్) చైర్మన్గా మార్నేని రవీందర్రావు నియామకమయ్యా రు.
పాత పాలకవర్గం ఖాళీతో కొత్త నియామకానికి మార్గం సుగమం
అభినందించిన సీఎం రేవంత్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాం కు(టెస్కాబ్) చైర్మన్గా మార్నేని రవీందర్రావు(Tescob Chairman Ravinder Rao) నియామకమయ్యా రు. ప్రస్తుతం ఆయన వరంగల్ డీసీసీబీ చైర్మన్(Warangal DCCB Chairman)గా, టెస్కాబ్ డైరెక్ట ర్గా(Tescob Director) కొనసాగుతుండగా, వైస్ చైర్మ న్గా హైదరాబాద్ డీసీసీబీ ఛైర్మన్(Hyderabad DCCB Chairman) కొత్తకుర్మ సత్తయ్య నియమితు లయ్యారు. హైదరాబాద్ అబిడ్స్ లోని టెస్కాబ్ ప్రధాన కార్యాల యంలో సోమవారం ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవంగా ముగిసింది. ఎన్నిక పూర్తయిన తరువాత రాష్ట్ర సహ కార సంఘాల రిజిస్ట్రార్ హరిత నుంచి రవీందర్రావు నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంత రం కొత్తగా ఎన్నికైన ఛైర్మన్, వైస్ ఛైర్మన్లతోపాటు డైరెక్టర్లు, ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర వ్యవసా యశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో పాటు పలువురిని మర్యా దపూర్వకంగా కలిశారు.
పాత కమిటీ రాజీనామాతో ఖాళీ లు.. రాష్ట్రంలో మొత్తం 9 డీసీసీ బ్యాంకులు ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసు కున్నాయి. డీసీసీబీ చైర్మన్లుగా ఉన్న వారిలో ఏడుగురు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్లోకి దూకా రు. టెస్కాబ్ చైర్మన్గా ఉన్న కొండూ రు రవీందర్రావుతో పాటు వైస్ చైర్మన్గా ఉన్న నల్గొండ డీసీసీ బ్యాంక్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ను వీడలేదు.
ఈ నేపథ్యంలో వారిని పదవులను నుంచి తొలగించేందుకు కొందరు బ్యాంకు డైరెక్టర్లు ఇటీవల సహకా రశాఖ రిజిస్ట్రార్కు అవిశ్వాస తీర్మా నానికి నోటీసు ఇచ్చారు. దాంతో ఈనెల 1న కొండూరి రవీందర్రావు, మహేందర్రెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. వాస్తవానికి అవి శ్వాసంపై సోమవారం సమావే శం నిర్వహించాల్సి ఉండగా ముం దస్తుగా రాజీనామాలు చేయటంతో సమావేశాన్ని రద్దుచేశారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులపై క్లారిటీ రావ డంతో మెజార్టీ డైరెక్టర్ల సమక్షంలో చైర్మన్గా రవీందర్రావు, వైస్ చైర్మన్గా సత్తయ్యలను ఎన్నుకు న్నారు.
Tescob Chairman Ravinder Rao