AP Assembly Elections: గణనీయమైన చరిత్ర సృష్టించాo
ఆంధ్రప్ర దేశ్లో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అసెంబ్లీ ఎన్ని కల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న ఎన్డీయే కూటమి పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం ఎన్డీయే సొంతం
ఎన్డీయే కూటమి పక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
ప్రజా దీవెన అమరావతి: ఆంధ్రప్ర దేశ్లో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.(AP Assembly Elections) అసెంబ్లీ ఎన్ని కల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న ఎన్డీయే కూటమి పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికయ్యారు. అమరావతిలో టీడీ పీ(TDP), బీజేపీ(BJP), జనసేన(Janasena) కూటమి శాసన సభాపక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబా బును శాసనసభా పక్ష నేతగా ఎన్ను కున్నారు. అంతేకాకుండా చంద్రబా బును సీఎం అభ్యర్థిగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా, బిజెపి రాష్ట్ర అధ్యక్షరాలు పురందే శ్వరితో పాటు మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్య వాదాలు తెలిపారు.ఏపీ చరిత్రలోనే గొప్ప తీర్పు అని అభివర్ణించారు.
ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని చంద్ర బాబు అన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్య త తమపై ఉందన్నారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని, నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారన్నారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని కితాబిచ్చారు. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలకు మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తీర్పుతో ఏపీ ప్రతిష్ఠ, గౌరవం పెరిగాయన్నారు. కాగా, ఈ తీర్మా నాన్ని గవర్నర్కు పంపనున్నారు. అనం తరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలుకుతారు. బుధవారం ఉదయం 11.27 గంట లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం(Chief Minister Chandrababu took oath) చేయనున్నారు.
అమరావతిలో జరుగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధిని సమష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 సీట్లకు గాను అద్భుత మెజారిటీతో 164 సీట్లలో విజయం సాధించిం దని, అలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ 25 సీట్లకుగాను 21 ఎంపీ స్థానాల ను కూటమి గెలుచుకుందని చెప్పా రు.
కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని వ్యా ఖ్యానించారు. కూటమి అంటే ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో కలసి కట్టుగా చూపించామని చెప్పారు. రాష్ర్టంలోని 5 కోట్ల మంది ప్రజలు కూటమి మంచి పాలన అందిస్తుం దని నమ్మకం పెట్టుకున్నారని జనసే నాని గుర్తుచేశారు. అందువల్ల కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని సూచించా రు. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ(BJP Alliance) కూటమిగా ఏర్పడిన క్షణం లోనే విజయంపై అందరికీ నమ్మకం ఏర్పడిందని చెప్పారు. అయితే, ఇంత ఘన విజయాన్ని మాత్రం ఊహించలేదని చెప్పుకొచ్చారు. కూటమికి ఇది అనూహ్య విజయ మని చెప్పారు.
ఐదేళ్ల జగన్ పాలన లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు(Andhra Pradesh People) నిజమైన సంక్షేమానికి దూరమయ్యారని చెప్పారు. అభివృద్ధి అనే పదానికి అర్ధం లేకుండా పోయిందన్నారు. ప్రజావ్యతిరేక పాలనను అంతమొం దించాలని నిర్ణయించుకున్న ప్రజలు కూటమికి అనూహ్య విజయాన్ని కట్టబెట్టారని, ఇందుకు వారికి సభా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేసు కుంటున్నానని పురందేశ్వరి చెప్పా రు. చంద్రబాబు యుక్తి, నరేంద్ర మోదీ స్ఫూర్తి, పవన్ కల్యాణ్ శక్తి ఈ మూడింటి కలయికే ఇవాల రాష్ట్ర ప్రజల ముందుకు కూటమి రూపంలో వచ్చిందని చెప్పారు.
ప్రజా సంక్షేమంపైనే దృష్టి పెట్టి, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పాలన కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ క్రమంలో కక్షపూరిత రాజకీయాలకు తావివ్వకుండా పార్టీ కార్యకర్తలను సంయమనం పాటించేలా చూడా లని పురందేశ్వరి కూటమి నేతలకు సూచించారు. ఐదేళ్లలో కూటమి లోని పార్టీలకు చెందిన కార్యకర్తలు అనేక కష్టాల పాలయ్యారని, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఈ సమయంలో ఒకింత అత్యుత్సా హం ప్రదర్శించకుండా మన కార్య కర్తలను శాంతింపజేయాలని కోరారు.
TDP and Janasena created in AP Assembly Elections