Road Incident: ఘోర రోడ్డు ప్రమాదం
ఆంద్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా పెదకాకాని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి లారీ-కారు- వాహనాలు ఢీ కొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
వేర్వేరు వాహనాలు ఢీకొట్టి ముగ్గురు మృతి
ప్రజా దీవెన, గుంటూరు: ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పెదకాకాని(Pedakakani of Guntur district) జాతీయ రహదారిపై సోమవారం రాత్రి లారీ-కారు- వాహనాలు ఢీ కొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మృతులను తేజ (20), రాంబాబు (40), మధు (25)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో 10 మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదం లో గాయపడిన క్షత గాత్రులకు గుంటూరు జీజీ హెచ్లో చికిత్స అందిస్తున్నారు. అలంకరణ పనులకు వెళ్లి వస్తున్న కూలీలు కొద్ది సమయంలో ఇంటికి చేరతా రనగా రోడ్డు ప్రమాద రూపంలో మృ త్యువు కబళించింది.
పోలీసులు తెలిపిన ప్రకారం సిమెంటు, కంకర కలిపే మిల్లర్నువాహనం వెనుక కట్టుకొని గుంటూరు వైపు తీసు కెళ్తోంది. పెదకాకాని అమెరికన్ ఆంకాలజీ క్యాన్సర్ ఆసుపత్రి(American Oncology Cancer Hospital) ఎదు ట ఉన్న జాతీయ రహదారి వద్దకు వచ్చే సరికి మరమ్మతులకు గురై రోడ్డు కుడివైపు నిలిచిపోయింది. ఆగి ఉన్న ఐషర్ వాహనాన్ని గమ నించకపోవడంతో వెనుక నుంచి వచ్చిన కారు మిల్లర్ని బలంగా ఢీకొ ట్టింది.
మిల్లర్ రోడ్డు మధ్యలోకి జరి గింది. ఇదే సమయంలో వెనుక వైపు నుంచి కూలీలతో వస్తున్న టా టా ఏస్ మినీ వాహనం మిల్లర్ని ఢీకొంది.ఈ ఘటనలో టాటా ఏస్లో ఉన్న పేరేచర్లకు చెందిన కె.రాంబా బు(40), గుంటూరు నగరానికి చెంది న తేజ (21) అక్కడికక్కడే మృతి చెందగా పాత గుంటూరుకు చెందిన డి.మధు (25) చికిత్స పొం దుతూ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యు లు తెలిపారు.
Pedakakani of Guntur district