Two times admissions: ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మీషన్ లు
ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి రెండు సార్లు విద్యార్థులను చేర్చుకు నేందుకు యూజీసీ అనుమతించిం ది.
ఈ ఏడాది నుంచే అమలుకు కార్యాచరణ పూర్తి
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి రెండు సార్లు విద్యార్థులను చేర్చుకు నేందుకు యూజీసీ(UGC) అనుమతించిం ది. రెగ్యులర్ విధానంలో కోర్సులు సాగించే యూనివర్సిటీలు(Universities), కాలేజీల కు ఈ మేరకు అవకాశం కల్పించిం ది. జనవరి లేదా ఫిబ్రవరి, జూలై లేదా ఆగస్టు నెలల్లో విద్యార్థుల అడ్మి షన్లకు యూజీసీ విధాన నిర్ణాయక మండలి ద్వైవార్షిక విధానాన్ని ప్రతిపాదించినట్టు కమిషన్ చైర్పర్సన్ జగదీశ్ కుమా ర్(Chairperson Jagdish Kumar)మంగళవారం తెలిపారు. ఈ నిర్ణయం 2024–25 విద్యాసంవ త్సరం నుంచే అమల్లోకి వస్తుంద న్నారు. మే 5న జరిగిన సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం యూనివర్సి టీలు, కాలేజీలు ఏటా జూలై, ఆగస్టు మధ్య రెగ్యులర్(Regular)విధానంలో విద్యార్థులకు అడ్మిషన్ కల్పిస్తున్నా యి. అయితే ఈ విధానం వల్ల లక్ష ల మంది విద్యార్థులు ఒక ఏడాది పాటు ఆయా సంస్థలలో చేరేందుకు నిరీక్షించాల్సి వస్తోందని, దీంతో వారి అమూల్యమైన సమయం వృథా అవుతోందని జగదీశ్ కుమార్ తెలిపారు. గత ఏడాది ఆన్లైన్ పద్ధతిలో ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్(Distance learning) విధానాలను ద్వైవార్షికంగా చేప ట్టినట్టు చెప్పారు. ఇది లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పిం చిందన్నారు.
Admissions higher education twice a year