Jagadeesh Reddy: కమీషన్ లపై కన్నుపడకుండా
విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులపై విచారణ ల పేరుతో రైతు రుణమా ఫీ అంశం, మంత్రుల కమీషన్ లపై ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు
ప్రజల దృష్టి మరల్చేందుకే విచారణ
విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రా జెక్టులపై విచారణ పేరుతో ఆటలు
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
ప్రజా దీవెన సూర్యాపేట: విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులపై విచారణ ల పేరుతో రైతు రుణమా ఫీ అంశం, మంత్రుల కమీషన్ లపై ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. విద్యుత్ కొను గోళ్లు , కాళేశ్వరం ప్రాజెక్టుల విచార ణ పై మాజీమంత్రి జగదీశ్ రెడ్డి తన దైన శైలిలో స్పందించారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుం టాయని, రాష్ట్ర ప్రభుత్వం మీడి యాకు ఎందుకు లీకులు ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగు నీరు అందించ కుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
విద్యుత్ కొనుగోళ్లు , కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై మాజీమంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. కాళేశ్వ రంలో నీళ్లు నిలిపి సాగు నీరు అం దించకుండా రైతులను ఇబ్బందు లకు గురి చేస్తున్నారని మండి పడ్డారు. నీళ్లు, విద్యుత్ విషయం లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫ లమైందన్నారు.పత్తి విత్తనాల కొరతలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని, కృత్రిమ కొరత సృష్టించి వాటిని బ్లాక్లో విక్రయిస్తున్నారని మండిపడ్డారు. బ్లాక్ దందాలో ఓ మంత్రి పాత్ర ఉందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.
ఆధారాలు అంద గానే త్వరలో పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడిస్తానన్నారు. నీళ్లు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ ప్రభు త్వం పూర్తిగా విఫలమైందన్నారు. పత్తి విత్తనాల కొరతలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని, కృత్రిమ కొరత సృష్టించి వాటిని బ్లాక్లో విక్రయిస్తు న్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలు గడిచి నా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలు దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోం దని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. తమ చేతగానితనం కప్పిపుచ్చుకు నేందుకు కమిషన్ల పేరుతో డ్రామా లు ఆడుతున్నారని ఆయన అన్నా రు. ఎన్నికల కోడ్ ముగియడంతో హామీల అమలుపై ప్రజలు ప్రశ్ని స్తారనే దురుద్దేశంతోనే ఇలాంటి పనులకు దిగుతున్నారన్నారు.
కాంగ్రెస్ చేసే ఆరోపణల్లో నిజం లేదనే విషయం తెసుస్తోందని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు ఉన్న దుస్థితి మళ్లీ కనిపిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతను బీఆర్ఎస్ పార్టీ ప్రజల దృష్టికి తీసుకెళ్తుందన్నారు. కమిషన్ల విచారణ పేరుతో రైతు రుణమాఫీ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్క దారి పట్టిస్తుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.
inquiries on power purchases and Kaleswaram projects