–పోలీసుల అదుపులో నిందితులు
–సుమారు 164 కేజీల గంజాయి సీజ్
GANJA : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గంజాయిపై (GANJA ) పోలీసుల పటిష్ట నిఘా కొనసాగుతున్న గంజాయి రవాణా మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా హైదరాబాదులో (HYDERABAD) రెండు అంత రాష్ట్ర గంజాయి ముఠాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం. పట్టుబడ్డ వారి నుంచి 164 కేజీల గంజాయిని సీజ్ చేయగా అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు నింది తులను అరెస్ట్ (ARREST) చేశారు. వివిధ మార్గాల్లో ఒడిస్సా నుండి హైద రాబాద్కు గంజాయిని తెప్పిస్తు న్నట్లు గంజాయి రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమా చారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పోలీసు లు పూర్తి వివరాలు వెల్లడించా రు.హైదరాబాద్లో గంజాయిపై పోలీసుల నిఘా కొనసాగుతోంది. తాజాగా నగరంలో రెండు అంత రాష్ట్ర గంజాయి ముఠాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు (POLICE) అరెస్ట్ చేశారు.
వారి నుంచి 164 కేజీల గంజాయిని ( 164 GANJA ) సీజ్ చేశారు. అక్రమరవాణా చేస్తు న్న ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వివిధ మార్గాల్లో ఒడిస్సా నుండి హైదరాబాద్కు గంజాయిని తెప్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమా చారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పోలీ సులు పూర్తి వివరాలు వెల్లడించా రు. భవాని నగర్ పిఎస్ పరిధిలో 164 కేజీల ( 164 GANJA) గంజాయిని సీజ్ చేశామ న్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసు కున్నట్లు వివరించారు. గతంలో ఈ ముగ్గురిపై ఎన్డీపిఎస్ యాక్ట్ కింద కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ అక్రమ గంజాయి ముఠాలో ప్రధాన నిందితుడు షేక్పర్వేజ్ హైదరా బాద్లోని ఆసిఫ్నగర్కు చెందిన వాడిగా పేర్కొన్నారు. రావుల పాలెం, హైదరాబాద్లోని (HYDERABAD) లంగర్ హౌస్లో పీఎస్లో గతంలో కేసులు నమోదైనట్లు చెప్పారు. రావులపా లెం ఎన్డిపిఎస్ కేసులో షేక్పర్వేజ్ అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో (JAIL) ఉన్నట్లు తెలిపారు. అదే సమయం లో ఓడిశాలోని కలిమెల ప్రాంతానికి చెందిన గంజాయి రైతు దీపక్ని కలిశాడన్నారు.
ఏప్రిల్లో లంగర్ హౌజ్ ఎన్డిపిఎస్ కేసులో జైలు నుండి విడుదలైన పర్వేజ్ సులభం గా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేసినట్లు వివరించారు. అందుకోసం తన సహచరుల ద్వారా ఒడిశా నుండి హైదరాబాద్కు (HYDERABAD) గంజాయి తెప్పించాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా దీపక్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో గంజాయిని హైద రాబాద్ నగరానికి తెప్పిం చాడు. బస్సులో వచ్చిన గంజాయిని షేక్ ఫర్వేజ్ హైదరాబాద్లో రిసీవ్ చేసుకునేవాడని చెప్పారు. విశ్వస నీయ సమాచారం మేరకు గంజా యి తరలిస్తుండగా భవాని నగర్ పోలీసులు రంగంలోకి దిగి షేక్ పర్వేజ్ను అరెస్ట్ చేసినట్లు తెలిపా రు. ముగ్గురు నిందితులను తదు పరి చర్యల కోసం భవాని నగర్ పోలీసులకు అప్పగించామన్నారు.