–‘గుత్తా ‘ కోసం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ లపై కాంగ్రెస్ గురి
–మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి పై బిఆర్ఎస్ ‘అవిశ్వాసం’ నేపథ్యంలో
–ఎక్కువ మొత్తంలో ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు ప్రారంభం
Sukhender Reddy :ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మళ్లీ రంగేసు కుని రంగోలి ఆడేందుకు వేదిక కాబోతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Sukhender Reddy) రాజ కీయ మార్పు అంశం తాజాగా తెర మీదకు వచ్చింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా శాసన మండలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టి కొనసాగుతూ వస్తున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ (CONGRESS PARTY)ప్రతిపక్ష బీ ఆర్ ఎస్ పార్టీ ప్రతినిధులను తమ పంచన చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆరంభించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే తాజాగా బి ఆర్ ఎస్ (BRS) శాసనమండలి సభ్యుల చేరిక వ్యవహారం అనివార్యం కావడంతో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ తలుపులు తెరిచే సంప్రదా యానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Sukhender Reddy) తన అనుమానాలు కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీలో చేర్చిన తర్వాత శాసనమండలి చైర్మన్ వివరంలో విరుపక్షాలు మల్ల గుల్లా లు పడుతూ వస్తున్నారు.
ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గుత్తా సుఖేందర్ రెడ్డి పై (Sukhender Reddy) అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేసిందన్న వార్తలు పొక్కడంతో మళ్లీ తెలంగా ణలో ఆపరేషన్ ఆకర్స్ కసరత్తు ప్రారంభమైంది. దీంతో తెలంగా ణలో మరో మారు రాజకీయం రంగులు మారుస్తున్న పరిస్థితులు తెరమీదకు వచ్చాయి. ఇదిలా ఉం డగా తెలంగాణలోనూ (TELANGANA) ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో తిరుగులేని బలం ఉన్నా మండలిలో మాత్రం బీఆ ర్ఎస్ పార్టీదే పైచేయిగా ఉంది. ఇది పలు కీలక బిల్లుల ఆమోదం, ఇతర అంశాల్లో అడ్డంకిగా మారే పరిస్థి తులు ఉన్న నేపథ్యంలో శాసనమం డలిలో ‘ఆపరేషన్ ఆకర్ష్’కు తెరలే పేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని తెలుస్తోంది. బీఆర్ఎస్కు (BRS)చెందిన 14 మందిని కాంగ్రెస్లోకి లాగేం దుకు ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. అంతా కుదిరితే బడ్జెట్ సమావే శాల్లోపే మండలిలో ‘ఆపరేషన్ ఆకర్ష్’ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగు తోంది. వాస్తవానికి శాసనమండలిపై ఇప్పటికిప్పుడే దృష్టి సారించాలన్న ఆలోచన కాంగ్రెస్ పెద్దలకు లేదు కానీ మండలి చైర్మన్ గుత్తా సుఖేం దర్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టను న్నారన్న వార్తలు రావడంతో కాంగ్రె స్ నాయకత్వం అప్రమత్తమైంది. ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా ఇటీవలికాలంలో పలుమార్లు ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా బీఆర్ఎస్ రాజకీయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగానూ వ్యవహ రిస్తున్నారు. అదే సందర్భంలో సు ఖేందర్రెడ్డి కుమారుడు అమిత్రెడ్డి కాంగ్రెస్లో (CONGRESS) చేరి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపునకు పనిచేసిన నేపథ్యంలో సుఖేందర్రెడ్డిపై ((Sukhender Reddy) అవి శ్వాస తీర్మానం పెట్టి ఆయన్ను పదవి నుంచి దించేయాలన్న చర్చ ఇటీవల బీఆర్ఎస్ నేతల్లో జరి గింది. అవిశ్వాస తీర్మానంపై ఓటిం గ్లో నెగ్గడం ద్వారా అధికార కాంగ్రె స్ను ఇరకాటంలో పడేయవచ్చు నన్న చర్చా చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు.
దీంతో అప్రమత్త మైన కాంగ్రెస్ మండలిలో ‘ఆప రేషన్ ఆకర్ష్‘కు తెరలేపాలన్న ఆలో చనకు వచ్చినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ (BRS)ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకున్నా దాన్ని ప్రశ్నించే పరిస్థితి బీఆర్ఎస్కు ఉండబోదని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం (TELANGANA)ఏర్పడిన కొత్తల్లో శాసనసభలో బీఆర్ఎస్కు తిరుగు లేని బలం ఉన్నా శాసనమండలిలో మాత్రం కాంగ్రెస్ సభ్యులదే పైచేయి గా ఉండేదని గుర్తు చేస్తున్నాయి. అప్పటి అధికార బీఆర్ఎస్ మం డలిలోని కాంగ్రెస్ ఎమ్మెల్సీల్లో మెజా రిటీ సభ్యులను వారి పార్టీలో చేర్చు కున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న ఎంఎస్ ప్రభాకర్, భానుప్రసాద్ కూడా కాంగ్రెస్ నుంచి వెళ్లినవాళ్లేనంటున్నాయి. కాగా14 మందికి తగ్గకుండా బీఆర్ఎస్ ఎమ్మె ల్సీలను (BRS MLCS) కాంగ్రెస్లో చేర్చుకునేందు కు ఆ పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తు తం సభలో బీఆర్ఎస్కు (BRS)నామినే టెడ్ సభ్యులతో కలుపుకుని 26 మంది ఉన్నారు. కాంగ్రెస్కు ఆరు గురు ఉన్నారు. బీజేపీ, ఎంఐఎం లకు ఇద్దరు చొప్పున, టీచర్ ఎమ్మె ల్సీలు ఇద్దరు ఉన్నారు. మరో రెం డు సీట్లు ఖాళీగా ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల సమయంలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడితే ఆ పార్టీ కి ఉన్న సంఖ్యాబలంతో తేలికగా నెగ్గుతుంది. సభలో బీఆర్ఎస్ ఆధి పత్యాన్ని గండి కొట్టాలంటే ‘ఆపరే షన్ ఆకర్ష్’ను అమలు చేయడం తప్ప వేరే మార్గం లేదని కాంగ్రెస్ (CONGRESS)వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి 14మంది ఎమ్మెల్సీలను చేర్చుకుంటే మండలిలో కాంగ్రెస్ సంఖ్యాబలం 20కి చేరుకుంటుం దని, ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పోస్టులూ భర్తీ చేస్తే మరింత మద్ద తు పెరుగుతుందని అంటున్నాయి.