Chandrababu: ప్రజా దీవెన, పోలవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) సోమవారం పోలవరంలో పర్యటిoచారు. అనుకున్నట్టుగానే ఉద యం 11 గంటలకు విజయవాడ నుంచి పోలవరం (polavaram) చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఇరిగేషన్ శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, అధికారులు, టీడీపీ (tdp), జనసేన (janasena), బీజే పీ నేతలు స్వాగతం పలికారు. హెలి కాప్టర్లో అక్కడకు చేరుకున్న చంద్రబాబు (Chandrababu) నేరుగా పోలవరం సందర్శించారు. ముందుగా ఆయన హెలికాప్టర్ ద్వారా పోలవరం నిర్మా ణాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం స్పీల్వే, కాపర్ డ్యామ్, డయాఫ్రం వాల్ పనులను చూశారు. ఇక మధ్యా హ్నం 2 నుంచి 3 గంటల వరకు ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అక్కడే మీడియా సమా వేశం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుంచి ఉండ వల్లికి తిరిగివెళ్లారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.