— జైలు మూలాకత్తులో కవితను పరామర్శించిన సబిత, సత్యవతి
KAVITHA: ప్రజాదీవెన, ఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బీఆర్ఎస్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (KAVITHA) ఆ పార్టీ మహిళా నేతలు పరామర్శించారు. తిహాడ్ కారాగారానికి వెళ్లిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy), సత్యవతి రాథోడ్ (Satyavathi Rathore) కవితతో ములాఖాత్ అయ్యారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. బీఆర్ఎస్ (BRS) నేతలు తిహాడ్ జైలుకు వెళ్లి ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్ వెళ్లినట్లు సమాచారం.