–ఏకంగా 19 మంది ఐఏఎస్లకు స్థానభ్రంశం, శ్రీలక్ష్మి, రజత్ భార్గవకు మొండిచేయి
–జలవనరుల స్పెషల్ సీఎస్గా సాయిప్రసాద్, సీఆర్డీయే కమిషనర్ గా కాటమనేని భాస్కర్
–ఏపీ కొత్త డీజీపీగా ద్వారకాతిరు మలరావు
IAS TRANFERS: ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ (ANDHRA PRADESH)పరిపాలనలో సంపూర్ణ ప్రక్షాళ న ఆరంభమైంది. మొదటి విడతలో ఏకంగా 19 మంది ఐఏఎస్లకు (IAS) స్థాన భ్రంశం కల్పించగా రాబోయే ఒకటి, రెండు రోజుల్లో మరికొందరు ఐఏఎస్లను బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. జగన్ (JAGAN) హయాంలో వివాదాస్పదులుగా ముద్రపడిన అధికారులకు అనుకున్నట్లుగానే ప్రాధాన్యతకు కోత పెట్టారు. తట స్థంగా వ్యవహరించిన వారికి పెద్ద పీట వేశారు. బుధవారం సాయం త్రం ఐఏఎస్ల బదిలీల (Transfers of IASs) ఉత్తర్వులు వెలువడ్డాయి. వివాదాస్పద ఐఏఎస్గా (IAS) ముద్రపడిన శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో (జీఏడీ) రిపోర్ట్ చేయించా రు. ఆమెతోపాటు రెవెన్యూ (ఎక్సై జ్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవకు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. వైసీపీకి వీరాభిమానిగా పని చేసిన డి.మురళీధర్ రెడ్డిని కూడా జీఏ డీలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పాఠశాల విద్యాశాఖ లో వింత ఉత్తర్వులు, వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్లుగా ముద్ర పడిన ప్రవీణ్ ప్రకాశ్కు కూడా ప్రస్తు తానికి పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీ లో రిపోర్ట్ చేయాలని ఆయనను ఆదేశించారు. ప్రస్తుతం ఆయన కీల కమైన ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ, సెర్ప్ సీఈవో వంటి కీలకమైన స్థానా ల్లో విధులు నిర్వహిస్తున్నారు. సీఎస్ తర్వాత అత్యంత కీలకమైన సీసీ ఎల్ఏ సాయిప్రసాద్ స్థాయి తగ్గిం చినప్పటికీ ప్రాధాన్యమున్న పోస్టే దక్కింది. ఆయనను జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అనిల్ కుమార్ సింఘాల్కు కీలకమైన మునిసిపల్ శాఖను (MUNICIPAL DEPARTMENT) కేటాయించారు. గతంలో సీఆర్డీఏలో పని చేసి ఆ విభాగంపై అవగాహన ఉన్న కాటమనేని భాస్కర్ను ప్రస్తుతం సీఆర్డీఏ కమిషనర్గా నియమించారు. గత ఎన్నికల సమయంలో ప్రధాన ఎన్ని కల అధికారి హోదాలో వ్యవహరిం చి, ఆపై జగన్కు (JAGAN) సన్నిహితుడిగా మారిన గోపాలకృష్ణ ద్వివేదీకి కూ డా మంచి శాఖే దక్కింది. ఆయ నను కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గతం లో చంద్రబాబు పేషీలో సంయుక్త కార్యదర్శిగా పని చేసిన పీఎస్ ప్రద్యుమ్న మళ్లీ చాన్స్ కొట్టేశారు. ఈసారి ఏకంగా సీఎం సెక్రటరీగా నియమితులయ్యారు. జగన్ హ యాంలో గాడి తప్పిన ఆర్థిక శాఖ ను సంస్కరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వివాదరహితులైన జాన కి, వాడరేవు వినయ్చంద్లను ఆర్థిక శాఖలో కొన్ని విభాగాలకు కార్యదర్శులుగా నియమించారు. మరో సీనియర్ అధికారిని ఆర్థిక శాఖ (Department of Finance) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. తొలివిడతలో 19మంది సీనియర్ ఐఏఎస్లకు స్థానచలనం కలు గగా రేపోమాపో విడతల వారీగా మరి కొందరి బదిలీపై ఉత్తర్వులు జారీ అవుతాయని, కీలకమైన శాఖలు, కలెక్టర్లకు స్థాన చలనం జరుగు తుందని సమాచారం.