Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahipal Reddy: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

–మహిపాల్ రెడ్డికి చెందిన మొత్తం 8 చోట్ల ఒకే దఫా తనిఖీలు

Mahipal Reddy: ప్రజా దీవెన,పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (Mahipal Reddy) నివా సాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారు లు గురువారం సోదాలు చేపట్టారు. ఏకకాలంలో బృందాలుగా విడిపో యి పటాన్‌చెరులోని ఆయన నివా సం, పట్టణంలోని శాంతినగర్‌లో ఉండే తమ్ముడు గూడెం మధుసూధన్‌రెడ్డి (madhusudan reddy), నిజాంపేటలో ఉండే అల్లుడి ఇళ్లపై, పటాన్‌చెరు, హైద రాబాద్‌(Hyderabad)జూబ్లీహిల్స్‌లోని మహిపా ల్‌రెడ్డి కార్యాలయాలు, జీఎంఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది చోట్ల సోదాలు చేపట్టిన ఈడీ.. పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకు న్నట్లు సమాచారం. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సోదాలు రాత్రి తొమ్మిదిన్నర వరకు కొనసా గాయి. మహిపాల్‌రెడ్డి (Mahipal Reddy) బీఆర్‌ఎస్‌ తరఫున మూడోమారు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్‌ ఎస్‌ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన అక్రమార్జనకు తెరతీశారన్న ఆరోపణలు నెలకొ న్నాయి. సంగారెడ్డి మండలం ఆరు ట్ల, పటాన్‌చెరు మండలం లక్డారం, చిన్నకంజర్ల గ్రామాల్లో పెద్దఎత్తున స్టోన్‌క్రషర్లు, క్వారీలను మహిపా ల్‌రెడ్డి కుటుంబం నిర్వహిస్తోంది. మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల ద్వారా కోట్లాది రూపాయలు కూడ బెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి దామో దర రాజనర్సింహ ఆదేశాలతో లక్డారంలో ఆయన సోదరుడు గూడెం మధుసూధన్‌రెడ్డి నిర్వహి స్తున్న సంతోష్‌ శ్యాండ్‌స్టోన్‌ సంస్థపై దర్యాప్తు చేపట్టారు. ఆ సంస్థలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని జిల్లా మైనింగ్‌, రెవెన్యూ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. మైనింగ్‌ శాఖకు కట్టాల్సిన సీనరేజ్‌ సొమ్ము రూ.342 కోట్లు ఎగ్గొట్టారని లెక్కలు తేల్చారు. సదరు సొమ్మును ప్రభుత్వ (government)ఖజానాలో జమ చేయాలని నోటీసులను సైతం జారీ చేశారు. లీజులో లేని భూమిలో అక్రమ మైనింగ్‌ పాల్పడినందుకు గూడెం మధుసూదన్‌రెడ్డిపై రెవెన్యూ, మైనింగ్‌ శాఖలు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మధుసూధ న్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి జైలుకు సైతం పంపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కుటుంబసభ్యుల అక్రమార్జనపై ఈడీ దృష్టి కేంద్రీకరిం చినట్లు తెలిసింది.

రాజకీయ కక్షతోనే సోదాలు: మహిపాల్‌రెడ్డి

ఈడీ సోదాలు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన ఉందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (Mahipal Reddy) అన్నారు. సోదాల అనంతరం ఆయన మాట్లాడారు. ఉదయం నుంచి రాత్రి వరకు తన, తన సోదరుడి ఇళ్లలో (houses)సోదాలు చేశారని, ఇదంతా రాజకీయ కక్షతోనే జరిగిందని ఆరోపించారు. తమ వద్ద నుంచి కేవలం జిరాక్స్‌ పత్రాలు తప్ప చిల్లి గవ్వ, తులం బంగారం సైతం తీసుకెళ్లలేదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులపై కక్ష పూరితంగా వేధింపులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.