–కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి
–పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
Pocharam Srinivasa Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: బిఆర్ ఎస్ పార్టీ కి (BRS)బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేత అయిన బాన్సు వాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి (Pocharam Srinivasa Reddy) కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో (Pocharam Srinivasa Reddy) పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరా రు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (REVANTH REDDY), మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పోచారం ఇంటికి వెళ్లి పార్టీలోకి(PARTY) రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన పోచారం వెంటనే తన తనయుడితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఖాయమని సీఎం రేవంత్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఆ మేరకు ఆ యన కాంగ్రెస్లో చేరినట్లు తెలు స్తోంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivasa Reddy)ఇం టి వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ (TELANGANA) పునర్నిర్మాణంలో భాగం గా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశా మన్నారు. పెద్దలుగా అండగా నిల బడాలని వారిని కోరామన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళ్తామని సీఎం చెప్పారు. రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నామని సీఎం తెలిపారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి భవిష్యత్లో సముచిత గౌర వం ఇస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు లను పూర్తి చేసేందుకు ఆయన సహ కారం తీసుకుంటామని సీఎం రేవంత్ చెప్పారు. తమది రైతు రాజ్యం అని రైతు సంక్షేమ రాజ్యం అని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలు పుకునిపోతామని ప్రకటించారు.
రేవంత్ రైతు పక్షపాతి.. …
రాష్ట్ర రైతాంగానికి మేలు చేసే ల క్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి (REVANTH REDDY) పని చేస్తు న్నారని పోచారం శ్రీనివాస్ రెడ్డి అ న్నారు. రేవంత్ చేస్తున్న రైతు అను కూల పనులకు రైతు బిడ్డగా గర్వి స్తున్నానని అన్నారు. రేవంత్ యు వ నాయకుడు అని ఇంకా 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించే సత్తా రేవంత్ రెడ్డికి ఉందన్నారు. తాను ఎన్నో పదవులు అనుభవించానని చెప్పా రు. రేవంత్ రైతు పక్షపాతి రైతుల కోసం పాటుపడే వ్యక్తి అని పోచా రం శ్రీనివాస్ రెడ్డి ప్రశంసించారు.
ఈ సందర్భంగా రేవంత్ (REVANTH)ఇంటి దగ్గర జరిగిన ఈ భేటీలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి (REVANTH REDDY) రైతుల సంక్షేమం కోసమే పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు.తెలంగాణ పున ర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసామని, పెద్దలు గా అండగా నిలబడాలని కోరినట్లు రేవంత్ చెప్పారు. రైతుల సంక్షేమం పై వారి సలహాలు సూచనలు తీసు కుని ముందుకెళతామని ఈ సంద ర్భంగా రేవంత్ వెల్లడించారు. రైతులకు సంబంధించి భవిష్య త్తులో ఎలాంటి విధాన నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తన సలహా తీసుకుంటుందని చెప్పారు. నిజామాబాద్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పోచారం శ్రీనివాస్రెడ్డి సహకారం తీసుకుంటామన్నారు. ఆయనకు తగిన పదవి కూడా వస్తుందని, రైతులకు రుణమాఫీ చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించ డంపై నేటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.