Shyama Prasad Mukherjee: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: విభజించు పాలించు అనే కాంగ్రెస్ కుహానా రాజకీయాలను వ్యతిరే కించిన జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ (Shyama Prasad Mukherjee) అని బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి (Nagam Varshit Reddy)అన్నారు. బిజెపి జిల్లా కార్యాలయంలో భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డా” శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించినారు ఈ సందర్భంగా బీజేపీ (bjp) జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ఏక్ దేశమే డో విధాన్ దొ ప్రధాన్ దౌ నిషాన్ సహి చలేగా సహ చలేగ అనే నినాదం తో దేశం మొత్తం ఏకీకృత్తం చేసిన మహనీయులు వారు అని కొనియాడారు. విభజించు, పాలించు, అనే కాంగ్రెస్ కుహానా రాజకీయాలను వ్యతి రేకించిన జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ప్రాణ త్యాగ ఫలితమే ఇవాల జమ్ముక శ్మీర్ కు స్వేచ్ఛ లభించడం దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ఆర్టికల్ 370 రద్దుతో ఆయన కల సాకరమైంది అన్నారు.
జమ్ముకశ్మీర్ కు (Jammu and Kashmir) స్వేచ్ఛా, స్వాతంత్య్రం కోసం సాగిన ఉద్యమంలో 1953 మే 11న అరెస్ట్ అయిన ముఖర్జీ జూన్ 23, 1953లో పోలీసులు కస్టడీలోనే (Police in custody) ప్రాణత్యాగం చేశారు అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలిదశలో భరతమాత ముద్దుబిడ్డను కోల్పోవడం దేశ రాజకీయాలకు దేశ అభివృద్ధికి తీరని లోటు గా మిగిలింది అని తెలియచేసారు వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ వారు కోరుకున్న హిందుత్వ అఖండ భారత్ నిర్మించడానికి సరేంద్ర మోడీ పాలనలో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా వారు కొనియా డారు. ఈ కార్యక్రమంలో కిసాన్ (kisan) మోర్చ జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, మహబూబాబాద్ ప్రబారి నూకల వెంకట నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు, పోతేపాక లింగస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం జిల్లా కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, గడ్డం మహేష్, యువమోర్చ జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖి, ఓబీసీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి తీరందాసు కనకయ్య, ఉపాధ్యక్షుడు మంగళపల్లి కిషన్, తదితరులు పాల్గొన్నారు.