–రోడ్లు, ఫ్లైఓవర్లు తదితర మౌలిక వసతుల కోసం
–రాష్ట్రానికి చెందిన 2,462 ఎకరా లను ఆర్సీఐ వాడుకుంటోంది
–అందుకు గాను మాకు 2450 ఎకరాల భూములు కావాలి
–వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతి పునరుద్ధరించండి
–కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ను ఎంపీ లతో కలిసి కోరిన సీఎం రేవం త్రెడ్డి
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: హైదరాబాద్ నడిబొడ్డుతో పాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారు ల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వా నికి అప్పగించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు (Minister Rajnath) ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) కోరారు. హైదరా బాద్ పరిధిలోని రావిర్యాల గ్రామం లో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎక రాల భూములను ఇ మారత్ పరిశోధన కేంద్రం ఉపయో గించుకుంటున్నందున అందుకు బదులుగా రక్షణశాఖ భూములు 2,450 ఎకరాలను తమకు బద లాయించాలని కోరారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం రాజ్నాథ్ తో 17 అశోకా రోడ్లోని ఆయన నివాసంలో సీఎం రేవంత్భేటీ (Revanth Reddy) అ య్యారు. దీంతో పాటు వరంగల్ సైనిక్ స్కూల్కు అనుమతులు పున రుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. రా ష్ట్ర ప్రభుత్వం, రక్షణ శాఖ భూము ల పరస్పర బదిలీకి అంగీకరించాల ని కోరారు. వరంగల్కు సైనిక్ స్కూ ల్ను గతంలోనే కేంద్రం మంజూరు చేసినా అప్పటి కేసీఆర్ (kcr) సర్కారు నిర్లక్ష్యం వహించందని, స్కూల్ నిర్మాణానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ అనుమ తుల గడువు ముగిసినందున వాటి ని పునరుద్ధరించాలని, లేదంటే తాజాగా మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఎం వెంట కాంగ్రెస్ ఎంపీలు కడియం కావ్య, గడ్డం వంశీ, మల్లు రవి, రఘురామిరెడ్డి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ ఉన్నారు.
గృహ నిర్మాణ శాఖ మంత్రిని కూడా భేటీ… ఈ ఆర్థిక సంవ త్సరాని కిగాను బీఎల్సీ మోడల్లో (BLC model)తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మం జూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ (Central Housing,), పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనో హర్లాల్ ఖట్టర్కు ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభు త్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాజ్ నాథ్సింగ్ (Raj Nath Singh)తో భేటీ అనంతరం ఖట్ట ర్ను ఆయన నివాసంలో రేవంత్ కలిశారు. తమ ప్రభుత్వం నిర్మిం చాలని భావి స్తున్న 25 లక్షల ఇళ్ల లో 15 లక్షలు ఇళ్లు పట్టణాభివృద్థి సంస్థల పరిధిలోకి వస్తాయని, వాటి ని లబ్థిదారు ఆధ్వర్యంలోని వ్యక్తి గత ఇళ్ల నిర్మాణం పద్ధతిలో నిర్మిం చను న్నట్లు కేంద్ర మంత్రికి వివరిం చారు. ప్రధానమంత్రి ఆవాస యోజ న పథకాన్ని కేంద్ర ప్రభుత్వం (Central Govt)ప్రతి ష్ఠాత్మకంగా తీసుకున్నందున 202 4–25 సంవత్సరానికి ఈ పథకం కింద మంజూరు చేసే ఇంటి నిర్మాణ వ్యయం నిధులు పెంచాలని కోరా రు. రాష్ట్రంలో తాము నిర్మించే ఇళ్ల ను పీఎంఏవై(యు) మార్గదర్శకాల ప్రకారం నిర్మించనున్నట్లు తెలిపారు. దీని కింద ఇప్పటివరకు తెలంగాణ కు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి రూ.2,390.58 కోట్లు గ్రాంటు కింద ప్రకటించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అయితే ఇందులో ఇప్పటి వరకు కేవలం రూ.1,605.70 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగ తా నిధులు విడుదల చేయాలని ఖట్టర్కు విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ మిషన్ (Smart City Mission)కింద చేపట్టే పనులు పూర్తి కానుందున మిషన్ కాలపరిమితిని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగిం చాలని కోరారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్, కరీంనగర్లో పను లు చేపట్టినట్లు తెలిపారు. వరంగల్ లో ఇవి 45 పనులు పూర్తయ్యా యని, రూ.518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసా గుతు న్నాయని చెప్పారు. ఇక కరీం నగర్లో 25 పనులు పూర్తయ్యాయ ని, రూ.287 కోట్ల వ్యయంతో చేప ట్టిన 22 పనులు కొనసాగుతున్నా యని వివరించారు.
మంగళవారం కాంగ్రెస్ అగ్రనే తలతో చర్చలు…
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (revanth reddy)మంగ ళవారం కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నట్లు తెలిసింది. సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్తో సమా వేశమై పీసీసీకి నూతన అధ్యక్షుడి ఎంపిక, నామినేటెడ్ (Nominated) పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశా లపై చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణలో లోక్సభ సీట్లు ఆశిం చిన దానికన్నా తక్కువ రావడంపై ఇటీవల పార్టీ కమిటీని ఏర్పాటు చేసిన దృష్ట్యా ఆ అంశంపైనా చర్చి స్తారని తెలిసింది. బీఆర్ఎస్ ఎమ్మె ల్యేల చేరిక అంశాన్ని సైతం అధి నాయకత్వం దృష్టికి రేవంత్ తీసుకె ళ్లనున్నారు. మరో 13 మంది బీఆ ర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అంశాన్ని అగ్రనేతల వద్ద ప్రస్తా విస్తా రని తెలిసింది. కాగా కాంగ్రెస్ ఎంపీ ల ప్రమాణాస్వీకారానికి కూడా సీ ఎం రేవంత్ హాజరుకానున్నారు. తెలంగాణ ఎంపీలు మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య ప్రమాణం చేయనున్నారు. రాహుల్ ప్రమాణ కార్యక్రమం సమ యంలో కూడా రేవంత్ ఉండే అవ కాశాలున్నాయి. కాగా, సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ నేరు గా తుగ్లక్రోడ్లోని తన నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ తరఫున గెలుపొం దిన ఎంపీలతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komati Reddy Venkat Reddy,), సీతక్కతో (Sitakka) సీఎం సమావేశమయ్యారు.