Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jeevan Reddy: సంజయ్ చేరిక..! జీవన్ రెడ్డి కినుక…!

–కాంగ్రెస్ లో పరిణామాలపై జీవన్ రెడ్డి కారాలుమిరియాలు
–మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్‌బాబు
–తొందరపాటు నిర్ణయాలొద్దని, చేరికల్లో సమన్వయ లోపం జరిగిందన్న మంత్రి
–అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

Jeevan Reddy:ప్రజా దీవెన, కరీంనగర్‌: కాంగ్రెస్ పార్టీలో చేరికలపై ఆ పార్టీలోని నేతలు కారాలు మిరియాలు నూరు తున్నారు. స్థానిక నాయ కత్వంతో సంప్రదించకుండా నేరుగా పార్టీలో ఇతర పార్టీల వారిని చేర్చుకోవ డంపై కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయక త్వం గుర్రు మీదుంది. ఈ క్రమం లోనే బీఆర్‌ఎస్‌ నేత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను (Sanjay Kumar) కాంగ్రెస్‌లో చేర్చు కోవడంపై సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి (Jeevan Reddy)కినుక వహించారు. తీవ్ర అసంతృప్తికి గురై రాజీనామా కు సిద్ధమవ్వడంతో నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయా ల్లో ఉన్న తనను మాట మాత్రంగానై నా సంప్రదించకుండా తన సొంత నియోజకవర్గంలో బీఆ ర్‌ఎస్‌ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చు కోవడాన్ని ఆయన ఆక్షేపించారు. ఇది తనను అగౌరవపరిచినట్లేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జగిత్యాల కాంగ్రెస్‌ నాయకులే కాకుండా ఇతర జిల్లా లకు చెందిన వందలాది కాంగ్రెస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు సైతం సోమవారం ఉదయమే జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. రాత్రి వరకూ అక్కడే ఉండి జీవన్‌ రెడ్డి తో మనోభావాలు షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరిద్దరు సీనియర్‌ నేతలు పార్టీకి రాజీనామా చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడికి లేఖలు పంపిం చినట్లు ప్రకటించారు. దీంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి జీవన్‌రెడ్డిని సము దాయించడానికి ప్రయత్నాలు ప్రా రంభించింది. సోమవారం మధ్యా హ్నం ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌, మరో ప్రభుత్వ విప్‌, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్‌ జీవన్‌రెడ్డిని కలిసి ఆయనకు నచ్చజెపుతూ తొందరపాటు నిర్ణయం ఏదీ తీసుకో వద్దని కోరినట్లు తెలిసింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన పార్టీ అధినా యకత్వం మంత్రి శ్రీధర్‌బాబును దూతగా పంపగా సాయంత్రం 6.30 గంటలకు ఆయన జీవన్‌రెడ్డి నివా సానికి వచ్చారు. ఈ సమయంలో కాంగ్రెస్‌శ్రేణులు, నేతలు జీవన్‌రెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌లు లక్ష్మణ్‌కుమార్‌, ఆది శ్రీని వాస్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయర మణారావు, కోరుట్ల ఇన్‌చార్జి నర్సిం గరావు తదితరులు జీవన్‌రెడ్డితో చర్చించి ఆయనకు నచ్చజెప్పారు. వ్యక్తికి గౌరవం లేకపోతే ప్రజా జీవి తం ఎందుకు పదవి ఎందుకు అని జీవన్‌రెడ్డి (Jeevan Reddy)అసంతృప్తి వ్యక్తం చేసిన ట్లు తెలిసింది. తాను ఇంతకాలం పార్టీలో గౌరవంగా కొనసాగానని గుర్తు చేసినట్లు సమాచారం.

పార్టీకి పెద్ద దిక్కు జీవన్‌రెడ్డి..
చర్చల అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) అక్కడే ఉన్న మీడియాతో మా ట్లాడుతూ జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కు అని, చేరికల విష యం లో కొంత సమన్వయ లోపం జరిగిం దని తెలిపారు. జీవన్‌రెడ్డి మనోభా వాలను పరిగణనలోకి తీసుకుంటా మని, ఆయనకు ఏ మాత్రం ప్రాధా న్యం తగ్గకుండా పార్టీ చర్యలు తీసు కుంటుందని తెలిపారు. గతంలో మాదిరిగానే ఆయ న పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని కోరుకుంటు న్నామన్నారు. ఈ సంఘటన కార ణంగా మనస్తాపాని కి గురైనట్లు జీవన్‌రెడ్డి వివరించార ని, అన్ని విషయాలను అధిష్ఠానాని కి తెలియజేస్తానని తెలిపారు. అనం తరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లా డుతూ జరిగిన పరిణామా లపై శ్రీధర్‌బాబుతో చర్చించాన న్నారు. కాంగ్రెస్‌ అభ్యున్నతి కోసం కృషి చేసిన కార్యకర్తల మనోభా వాలు దెబ్బతిన్నాయన్నారు. కార్య కర్తల మనోభావాలను గౌరవించా ల్సిన బాధ్యత పార్టీపై ఉందని అభి ప్రాయపడ్డారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాన న్నారు. పార్టీ నిబంధనల్ని పాటి స్తానని, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.