Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

IAS Transfer: మరోమారు ఐఏఎస్ ల మూకుమ్మడి బదిలీ

–ఇద్దరు ఐపీఎస్‌లు, ఒక ఐఎఫ్‌ఎస్‌, మరో నాన్‌క్యాడర్‌ సైతం
–సాధారణ పరిపాలన శాఖ పూర్తి స్థాయి కార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డి
— గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు
— ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌కుమార్‌ సుల్తానియా

IAS Transfer: ప్రజా దీవెన, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం భారీస్థాయి లో 40 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ (IAS Transfer) చేసింది. మరో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు, ఒక ఐఎఫ్‌ఎ స్‌ అధికారి, ఒక నాన్‌–కేడర్‌ అధికారిని (An IFAS officer is a non-cadre officer) బదిలీ చేసి పోస్టింగులు ఇచ్చిం ది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవా రం జీవో జారీ చేశారు. 1998 బ్యాచ్‌ సీనియర్‌ ఐఏఎస్‌, పంచా యతీరాజ్‌, గ్రామీణాభిృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. ఆయనను ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది.

ప్రణాళిక శాఖ (Planning Department) అదనపు బాధ్యతలు అప్పగించిం ది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభి వృద్ధి శాఖకు మరో ముఖ్యకార్య దర్శిని నియమించే వరకూ ఆ బాధ్యతల్లో కొనసాగాలని ఆదేశిం చింది. హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆమ్రపాలికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా (As GHMC Commissioner) పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించిం ది. కీలకమైన సాధారణ పరిపాలన శాఖకు పూర్తిస్థాయి కార్యదర్శిగా సి.సుదర్శన్‌ రెడ్డిని నియమించింది. ఉద్యానవన శాఖ డైరెక్టర్‌గా ఉన్న కె.అశోక్‌రెడ్డిని బదిలీ చేసి, కీలక మైన వాటర్‌ బోర్డు ఎండీగా నియ మించింది. గిరిజన సంక్షేమ శాఖ (Department of Tribal Welfare) డైరెక్టర్‌గా ఉన్న ఈవీ నర్సింహారెడ్డిని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌గా నియమించింది. నాన్‌క్యాడర్‌ అధికారి, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ పి.ఉపేందర్‌రెడ్డిని బదిలీ చేసి, జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌గా నియమిం చింది. అవినీతి నిరోధక సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌–2 వైవీఎస్‌ సుధీంద్రను.. హైదరాబాద్‌ సిటీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పోస్టులో నియమించింది. వెయిటింగ్‌లో ఉన్న పి.సీతారామ్‌ను తెలంగాణ యాంటీ నార్కొటిక్‌ బ్యూరోలో ఎస్పీగా నియమించింది. వీరికి సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.