–ఫోన్ ట్యాపింగ్ నిందితులకు మరోసారి చుక్కెదురు
–బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన నాంపల్లి కోర్టు
Phone Tapping Case: ప్రజా దీవెన, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) నిందితులకు మరో సారి చుక్కెదురైంది. నింది తులైన భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు (Bail petitions were taken up by the court)కొట్టివేసింది. తమను రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేశా రని, తమపై ఎలాంటి సాక్ష్యాలు లేవని పిటిషనర్ల తరఫు న్యాయ వాదులు కోర్టుకు తెలిపారు. కేసులో (case) అరెస్టయిన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొ చ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు చెబుతున్నాయని కోర్టులో ప్రస్తావించారు. 90 రోజుల్లోనే తాము ఛార్జిషీట్ వేశామని, వివరాలు సరిగా లేవని తిప్పి పంపడంతో తిరిగి మళ్లీ వేసినట్టు పోలీసుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. చివరగా పోలీసుల వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లను (Bail petitions) కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో ఫోన్ టాపింగ్ కేసులో మరొకసారి అరెస్ట్ అయిన నిందితులకు మరోసారి చుక్కెదురు అయింది.
అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్న, ఏసీపీ ప్రణీత్ రావు బెయిల్ పిటీషన్ నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. 90 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయనందున బెయిల్ (bail) కావాలని నిందితులు కోరారు. తాము బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీట్ లేదని నిందితుల తరఫు న్యాయవాది బెయిల్ పై (bail) వాదనల సమయంలో కోర్టుకు తెలిపారు. అరెస్టయిన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే బెయిల్ ఇవ్వవచ్చునని వాదనలు వినిపించారు. బెయిల్ ఇవ్వవచ్చునని పలు తీర్పులు చెబుతున్నాయన్నారు. అయితే, తాము 90 రోజుల లోపే ఛార్జిషీట్ దాఖలు చేశామని పోలీసుల తరఫు న్యాయవాదులు తెలిపారు. ఛార్జిషీట్ను కోర్టు తిప్పి పంపించిందని… ఇలా పంపినంత మాత్రాన ఛార్జిషీట్ వేయనట్లు కాదని పోలీసులు తెలిపారు.
పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు తెలంగాణ బబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా (america) నుంచి రావాల్సి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ (phone tapping) చేయించారనే అభియోగాలు ప్రభాకర్రావుపై నమోదు అయ్యాయి. ప్రభాకర్రావును ప్రశ్నిస్తేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అంటోంది. ఈ లెక్కన.. ఆయన దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాకర్రావు పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.. ఆయన వీసా గడువు ముగిసిందని ఎప్పుడైనా ఇండియాక రావొచ్చని భావిస్తున్నారు. అనారోగ్య సమస్యల వల్ల చికిత్స కోసం వచ్చానని పోలీసులకు అందుబాటులో ఉంటానని జూన్ 26న భారత్’ కు వస్తానని అడ్వకేట్ ద్వారా ప్రభాకర్ రావు కోర్టులో మెమో దాఖలు చేశారు. అయితే ఆయన రాలేదు. వీసా గదువు పొడిగించుకుని ఉండవచ్చని చెబుతున్నారు. మరో నిందితుడు. శ్రవణ్ రావుకు కూడా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేసుకు సంబంధించి ఎవిడెన్స్ మెటీరియల్ మొత్తాన్ని పోలీసు (police) ఉన్నతాధికారులు కోర్టుకు సమర్పించారు. మూడు బాక్సులలో న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించారు. ఇందులో హార్డ్ డిస్క్లు, సిడీ, పెన్ డ్రైవ్లు ఉన్నాయి. ఈ మెటీరియల్ ఎవిడెన్స్లు లేని కారణంగా రెండు సార్లు చార్జిషీటును (charge sheet) కోర్టు వెనక్కి పంపింది.+నైల్ గా అన్నిటినీ జత పరుస్తూ పోలీసులు మూడోసారి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కాగా.. ఈ ఆధారాలను నిందితులకు తెలీకుండా రహస్యంగా ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనధికారికంగా ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజునే ఆధారాలన్నీ శ్రవణ్ రావు ధ్వంసం చేసినట్లుగా తెలియడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అప్పట్నుంచి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.