Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rangareddy shadhanagar : షాద్ నగర్ లో భారీ పేలుళ్లు

--పేలుడు ఘటనలో ఆరుగురు కార్మికులు మృత్యువాత --పదుల సంఖ్యలో కార్మికులకు తీవ్ర గాయాలు

షాద్ నగర్ లో భారీ పేలుళ్లు

–పేలుడు ఘటనలో ఆరుగురు కార్మికులు మృత్యువాత
–పదుల సంఖ్యలో కార్మికులకు తీవ్ర గాయాలు

ప్రజా దీవెన, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌ ( shad hna gar) లో గల సౌత్‌ గ్లాస్‌ పరిశ్రమలో భారీ పేలుడు సంభ వించింది. పేలు డు ఘటనలో ఆరుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. బాయిలర్‌ ( boilor) పేలినట్లు స్థానికులు చెబుతుoడగా ప్రమాద సమయం లో పరిశ్రమలో 30 మంది పని చేస్తున్నారు. వారి లో 20 మంది కార్మికుల (labour) కు తీవ్రగాయాలు అయ్యాయి.

సమాచారం అం దుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘట నాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మరో నలుగురి ఆ చూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేప ట్టారు. శరీర భాగాలు పరిశ్రమలో చెల్లాచెదురుగా పడ్డాయి. ఒకే సారి పేలుడు ( blost) సంభవించి నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. క్షతగాత్రుల ను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తు న్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొన సాగుతున్నాయి. మృతులు ఒడిశా, బిహార్‌, యూపీ వాసులుగా గుర్తించారు. తీవ్రగాయాలైన వా రిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది.

*ప్రమాదంపై సీఎం రేవంత్ ఆరా..* షాద్ న‌గ‌ర్ ప్ర‌మాద ఘ‌ట‌న‌ పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ( CM revanth reddy) అధి కారు ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని వెంట‌నే ఆసుప‌ త్రికి త‌ర‌లించి వైద్య చికిత్స‌లు అందించాల‌ని ఆదేశించారు.

ప్ర‌మాద స్థ‌లిలోనే ఉన్న క‌లెక్ట‌ర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ రెవెన్యూ, పోలీసు (pol ice) అగ్నిమాప‌క శాఖ‌, కార్మిక‌, ప‌రి శ్ర‌మ‌లు, వైద్య బృందాలు ఘ‌ట‌నా స్థ‌లి లోనే ఉండి స‌మ‌న్వ‌యంతో స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని సూచించారు.

Rangareddy shadhanagar