Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

False Cases Against Journalists : జర్నలిస్టులపై అక్రమ కేసులు సహించం

–ఆదిలాబాద్ కలెక్టర్, ఎస్పీనీ కలిసిన టియుడబ్ల్యూజే

False Cases Against Journalists :ప్రజా దీవెన, ఆదిలాబాద్: జర్నలి స్టులపై పోలీసుల కేసులు ఎత్తివే యాలని పత్రికా స్వేచ్ఛను కాపా డాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి టీయూడ బ్ల్యూజే హెచ్ 143 తరఫున జర్న లిస్టులు వినతి పత్రం సమర్పిం చారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా లో రిపోర్టర్ల పై కేసులు పెరగడమే కాక, ఎలాంటి విచారణ లేకుండానే జర్నలిస్టుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీ సే విధంగా కేసులు నమోదు చేయ డంపై ఎస్పీ దృష్టికి తీసుకురావడం జరిగిందని tuwj (H 143) జిల్లా అధ్యక్షులు బేత రమేష్ తెలిపారు.

గుడిహత్నూర్ తో పాటు జిల్లాలో ని పలు మండలాల్లో ప్రింట్, ఎల క్ట్రానిక్ మీడియా విలేకరులపై అక్ర మంగా బనాయించిన కేసులు ఎత్తి వేయాలని ఎస్పీని కోరడం జరిగిం ది. అయితే ఇందుకు స్పందించిన ఎస్పీ గుడిహత్నూర్ లో విదినిర్వా హణలో న్యూస్ కవరేజ్ కు వెళ్లిన రిపోర్టర్ లపై పెట్టిన కేసులను ఎత్తి వేస్తున్నట్లు ఎస్పీ హామీ ఇచ్చారు. ఇకపై జర్నలిస్టులపై వచ్చే ఫిర్యాదు లను అక్రిడేషన్ కమిటీ చైర్మన్ కలె క్టర్ దృష్టికి తీసుకువస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నేర వ్యవస్థను అసాంఘిక శక్తులను ని యంత్రించేందుకు జర్నలిస్టులు స హకరించాలని సూచించారు కలె క్టర్ ఎస్పీ ని కలిసిన వారిలో యూ నియన్ జండ్రల్ సెక్రెటరీ లక్ష్మీపురం రాజు,ఉపద్యక్షలు అన్వర్, ఇచ్చో డ,గుడిహత్నూర్ ,అదిలాబాద్ జర్నలిస్టులు పాల్గొన్నారు.