Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

AP CM Nara Chandra Babu Naidu : తల్లికి వందన పథకానికి సిద్ధం

–జూన్ లో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్

–త్వరలోనే నిరుద్యోగ భృతి కింద రూ.3వేలు

–ఏపీ సీఎం నారా చంద్ర బాబు నాయుడు

AP CM Nara Chandra Babu Naidu :  ప్రజాదీవెన, ఏపీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం కొలువుదీరిన అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమలవుతున్న హామీలు, సూపర్‌ సిక్స్‌లోని మిగతా పథకాల అమలుకు చేపట్టిన చర్యలను సీఎం అసెంబ్లీలో వివరించారు. వచ్చే మే నెలలోనే తల్లికి వందనం పథకం అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు.

అలాగే మెగా డీఎస్సీపై కూడా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభంనాటికి అంటే వేసవి సెలవుల తర్వాత జూన్‌ నెలలో పాఠశాలలు ప్రారంభం నాటికి 16,384 టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఆ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. రిక్రూట్‌మెంట్‌ పూర్తి చేసి, ట్రైనింగ్‌ ఇచ్చి పోస్టింగ్‌లు అందచేస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే నిరుద్యోగ భృతి కింద రూ.3,000 అందజేస్తామన్నారు.