Big Breaking : ప్రజా దీవెన నంద్యాల: నంద్యాల జిల్లా లింగాపురంలో వైసీపీ కార్య కర్త దారుణ హత్యకు గురయ్యారు. పొలానికి వెళ్తున్న సమయంలో సు ధాకర్ రెడ్డి అనే కార్యకర్తను మాటు వేసి గొడ్డలితో అతికిరాతంగా నరికి చంపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ కేసులో కొంతమందిపై అనుమానా లు ఉన్నట్లు పోలీసులు చెబుతు న్నారు.
హత్యగావించబడ్డ సుధాక ర్ రెడ్డికి ఆస్తి తగాదాలు ఉండటం తో ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్న ట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఒక ల్యాండ్ కు సంబంధించి సుధా కర్ రెడ్డితో కొంతమందికి వైరం ఉం దని, దీని వెనుక వారి హస్తం ఏమై నా ఉందా అనే కోణంలో విచారిస్తు న్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ కూడా ఒకటి దొరికిందన్నా రు. దాన్ని బట్టి నిందితుల్ని పట్టు కుంటామని పోలీసులు చెబుతు న్నారు. అయితే ఈ హత్య వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నా రు. టీడీపీ నేతల ప్రమేయంతోనే సుధాకర్ రెడ్డిని అతిదారుణంగా హత్య చేశారనివైసీపీ నేతలు ఆ రోపిస్తున్నారు.