Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking : బిగ్ బ్రేకింగ్, తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం

Big Breaking :

ప్రజా దీవెన, తిరుమల: దేశవ్యాప్తం గా సంచలనం సృష్టించిన తిరుమ ల తిరుపతి దేవస్థానం మహా ప్రసా దం లడ్డు కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తి రుమల లడ్డు ప్రసాదoలో తిరు మల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ లో కూ టమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విచారణకు ఆదేశించడం తోపాటు కేసు నమోదు చేసిన విష యం తెలిసిందే. ఈ క్రమంలో తా జాగా లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవ హారంలో 4గురిని సిబిఐ దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. దీంతో లడ్డు కల్తీ వ్యవహారంలో విచారణ వేగవంతం అవుతుందన్న సంకే తాలు అందుతున్నాయి. కాగా
భోలే బాబా డైరీకి (రూర్కీ, ఉత్తరా ఖండ్) అప్పట్లో డైరెక్టర్లుగా పనిచే సిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణ వి డైరీ(పూనంబాక) సీఈవో అపూ ర్వ వినయ్ కాంత్ చావ్డా, ఎఆర్ డైరీ(దుండిగల్) ఎండి రాజు రాజ శేఖరన్ లను దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. క్రై నెంబర్ 470/ 24లో అరెస్టు చేసి తిరుపతి కోర్టు లో వీరేందర్నీ హాజరు పరిచారు.

దర్యాప్తులో అక్రమాలు బట్టబ యలు.. కల్తీ లడ్డు వ్యవహారంలో దర్యాప్తు వేగవంతం కావడంతో పాటు అవినీతి అక్రమాలు బట్టబ యలైనట్లు తెలుస్తోంది. నెయ్యి సరఫరా పేరులో అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడ్డారు అక్ర మార్కులన్న ఆరోపణలు గు ప్పు మంటున్నాయి. ఎఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లు దక్కించు కున్న వైష్ణవి డైరీ ప్రతినిధులు పాల కవర్గంతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్టు దర్యాప్ నివేదిక వెల్ల డిస్తోంది. ఎఆర్ డైరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి మరీ వైష్ణవి డైరీ
టెండర్ కథను ముందుకు నడి పించింది. రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు సృష్టిం చడం గమనార్హం. భోలే బాబా డైరీ కి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థ్యం లేదని అధికారులు.
విచారణలో తేటతెల్లం చేశారు
సమగ్ర విచారణతో అక్రమాలను గుర్తించిన దర్యాప్తు బృందం మూ డు డైరీలకు చెందిన 4గురుని అ రెస్టు చేసింది.