Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chief Minister Chandrababu : బాణసంచా కేంద్రంలో భారీ విస్ఫోటనం

–తయారీ కార్మికుల బతుకులు బుగ్గిపాలు

— ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా కైలా సపట్నంలో ఆందోళన

— మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల ప్రభుత్వ పరిహారం

— ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

Chief Minister Chandrababu : ప్రజా దీవెన, అమరావతి : ఆంధ్రప్ర దేశ్ అనకాపల్లి జిల్లాలో ఘోర విషా ద సంఘటన చోటుచేసుకుంది. అ నకాపల్లి జిల్లా పరిధిలోని ఓ బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ వి స్ఫోటనం సంభవించింది. ఈ ఘట నలో 8 మంది కార్మికులు మృతిచెం దగా, మరో 8మంది తీవ్రంగా గా యపడ్డారు. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగిం ది. కైలాసపట్నానికి చెందిన మద పాల జానకీరామ్‌ గ్రామ శివారులో శ్రీవిజయలక్ష్మీ ఫైౖర్‌వర్క్స్‌ పేరుతో సుమారు 15 ఏళ్ల నుంచి బాణసం చా తయారీకేంద్రాన్ని నడుపుతు న్నారు. ఆదివారం ఈ కేంద్రంలో యజమానితో పాటు మొత్తం 16 మంది పనులు చేస్తున్నారు. మ ధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కొంతమంది కార్మికులు షాట్‌ బాక్స్‌ లో మందుగుండు కూరుతుండగా ఒత్తిడి అధికమై నిప్పురవ్వలు రేగా యి. రెప్పపాటులో అక్కడ ఉన్న ముడిపదార్థాలు, తయారైన బాణ సంచాకు మంటలు అంటుకుని భారీ శబ్దంతో పేలుడు సంభ విం చింది. పెద్దఎత్తున మంటలు లే చాయి. పేలుడు ధాటికి భూమి కంపించింది. నర్సీపట్నం అగ్ని మాపక సిబ్బంది రెండు శకటాలతో వచ్చి మంటలను అదుపుచేశారు. అప్పటికే పలువురు మృతిచెం దారు.

మిన్నంటిన క్షతగాత్రుల రోదన లు …క్షతగాత్రుల రోదనలు మి న్నంటాయి. ఈ ప్రమాదంలో అప్పి కొండ తాతబ్బాయి(50), పురం పా ప(40) గుంపిన వేణు(40), సేనాప తి బాబురావు(56), దాడి రామల క్ష్మి(38) సంగరాతి గోవింద(45), మెడిసి హేమంత్‌ (25), దేవర నిర్మల(38) మృతిచెందారు. తీ వ్రంగా గాయపడిన బాణసంచా కేం ద్రం యజమాని మదపాల జానకీ రామ్‌, సియాద్రి గోవింద, సంగరాతి శ్రీను, గుంపిన సూరిబాబు, జల్లూ రు నాగరాజు, వేళంగి సంతోషి, వే ళంగి షరోణి, వేళంగి రాజును తొ లుత కోటవురట్ల సీహెచ్‌సీకి తర లించారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరా మర్శించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వేళంగి రాజు, గుంపి న సూరిబాబు, సంగరాతి శ్రీనును నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి, మిగిలిన ఐదుగురిని విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలించారు. వీరిలో జల్లూరు నాగరాజుకు 90శాతం మేర శరీరం కాలిపోవడంతో పరిస్థి తి విషమంగా ఉందని తెలిసింది. జానకీరామ్‌ శరీరం కూడా 50శాతం మేర కాలిపోయిందని చెబుతున్నా రు. బాణసంచా తయారీకేంద్రంలో జరిగిన ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తామని హోం మం త్రి వంగలపూడి అనిత అన్నారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని ఎంపీ సీఎం రమేశ్‌తో కలిసి పరామర్శిం చారు. క్షతగాత్రుల పరిస్థితిపై వై ద్యులను ఆరా తీశారు.

 

 

ఈ సంద ర్భంగా మంత్రి మాట్లా డుతూ మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ.15లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించా రని తెలిపారు. విచారణ అనంత రం పేలుడుకు గల కారణాలు తెలు స్తాయని చెప్పారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణసంచా తయా రీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 8మంది కార్మికులు ప్రాణాలు కో ల్పోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోం మంత్రి అనిత, జిల్లా కలెక్టర్‌ విజ యకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హాలకు ఫోన్‌చేసి మాట్లాడారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేది క సమర్పించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాణసం చా తయారీ కేంద్రంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారని తెలిసి దిగ్భ్రాంతి గురైనట్లు డిప్యూటీ సీ ఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ప్రమాదంపై ఏపీ బీజేపీ అధ్యక్ష రాలు పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. బాణసంచా తయారీ కేం ద్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ఆరాతీశారు. ఎనిమిది మంది కార్మి కులు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.